News March 21, 2025

‘తాగు నీటి సమస్యకు పర్యవేక్షక సెల్ ఏర్పాటు’

image

గ్రామీణ ప్రాంత ప్రజలు వేసవిలో తాగునీటి కొరత సమస్యలను తెలుసుకొని పరిష్కరించుటకు రాజమహేంద్రవరం జిల్లా గ్రామీణ నీటి సరఫరా ఇంజినీరింగ్‌ అధికారి కార్యాలయంలో పర్యవేక్షక సెల్‌ ఏర్పాటు చేశారు. ఈమేరకు జిల్లా గ్రామీణ నీటి సరఫరా ఇంజినీరింగ్‌ అధికారి బి.వెంకటగిరి ప్రకటనలో తెలిపారు. తాగునీటి సమస్యలను ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 వరకు 91001 21190 నంబరుకు తెలియజేయాలన్నారు.

Similar News

News March 31, 2025

రాజమండ్రి: ముస్లిం సోదరులకు కలెక్టర్ శుభాకాంక్షలు

image

రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు వారి కుటుంబ సభ్యులకు జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆమె ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ..తోటి వారికి, పేద వారికి మనకు ఉన్న దాంట్లో సహాయం చేసే గొప్ప దాన గుణాన్ని చాటే పండుగ రంజాన్ అన్నారు. దాతృత్వానికి ప్రతీకగా నిలిచే రంజాన్ మాస ఉపవాస దీక్షలు నియంత్రణా సాధ్యం చేసే గొప్ప సందేశం అని పేర్కొన్నారు.

News March 30, 2025

రాజమండ్రి: సోమవారం పీజీఆర్ఎస్ రద్దు: కలెక్టర్

image

మార్చి 31 రంజాన్ సందర్భంగా ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించడంతో పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని సోమవారం తాత్కాలికంగా రద్దు చేసినట్టు జిల్లా కలెక్టర్ ప్రశాంతి ఆదివారం ప్రకటించారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయం, రెవెన్యు డివిజనల్, మునిసిపల్, మండల స్థాయిలో కార్యక్రమం నిర్వహించడం లేదన్నారు. జిల్లా ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కలెక్టర్ ప్రశాంతి విజ్ఞప్తి చేశారు .

News March 30, 2025

రాజనగరం: ‘ఉగాది’లో విద్యార్థులు

image

తెలుగువారి నూతన సంవత్సరం ప్రారంభమయ్యే ‘ఉగాది’ పండుగను పురస్కరించుకుని స్థానిక దివ్య కళాశాల విద్యార్థులు శనివారం సాయంత్రం కళాశాల మైదానంలో ‘ఉగాది’ అక్షరాలుగా ఏర్పడి ఆ పండుగ పట్ల తమకు ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. వీరి ఆకృతిని చూసేందుకు వచ్చిన అధ్యాపకులు, సహ విద్యార్థులకు వారు ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ సందడి చేశారు. దీంతో విద్యార్థులను ఉపాధ్యాయులు అభినందించారు.

error: Content is protected !!