News March 24, 2025
తాగునీటి సమస్య పై టోల్ ఫ్రీ : జిల్లా కలెక్టర్

గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తాగునీటి సమస్య ఉంటే కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన తాగునీటి మానిటరింగ్ సెల్కు ఫోన్ చేసి వివరాలు తెలియజేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సూచించారు. తాగు నీటి సమస్యల కోసం 9908712421 నంబర్కు కాల్ చేయవచ్చని తెలిపారు. ప్రతి రోజు ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు పని చేస్తుందని పేర్కొన్నారు. ఫిర్యాదులను సంబంధిత పంచాయతీ, మిషన్ భగీరథ అధికారులకు తెలుపాలన్నారు.
Similar News
News March 29, 2025
అన్నమయ్య: బాలుడిపై అఘాయిత్యం.. వ్యక్తి అరెస్ట్

అన్నమయ్య జిల్లాలో బాలుడిపై అఘాయిత్యానికి పాల్పడ్డ ఆటో డ్రైవర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. సంబేపల్లి ఎస్ఐ భక్తవత్సలం కథనం మేరకు.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన 9ఏళ్ల బాలుడు ఈనెల 27సాయంత్రం ఇంటి వద్ద సైకిల్ తొక్కుతున్నాడు. అదే గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ రమేశ్ బాలుడికి మాయమాటలు చెప్పి ఆటోలో తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ కేసులో పోలీసులు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
News March 29, 2025
కొండాపురం ప్రమాదంలో గాయపడ్డ భార్య, భర్తలు మృతి

కడప జిల్లా కొండాపురం 4 వరుసల రహదారిలోని CMR కాంప్లెక్స్ వద్ద శనివారం రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. బైకును కారు ఢీకొనడంతో బైకులో ఉన్న సరోజ, రామమోహన్ అనే దంపతులకు తీవ్ర గాయాలయ్యాయి. సరోజను చికిత్స కోసం అనంతపురం హాస్పిటల్కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది.<<15922594>> భర్త రామ్మోహన్<<>> అనంతపురంలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో వారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
News March 29, 2025
కంప్యూటరీకరణ వేగవంతం చేయాలి: బాపట్ల కలెక్టర్

సహకార సంఘాల కంప్యూటరీకరణను వేగవంతం చేయాలని బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకట మురళి అధికారులను ఆదేశించారు. శనివారం బాపట్ల కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలలోని సహకార సంఘాల వివరాలను కంప్యూటరీకరణ చెయ్యడంలో అధికారులు అలసత్వం వహించడంపై కలెక్టర్ అసహనం వ్యక్తపరిచారు.