News March 20, 2025
తాగునీటి సరఫరాకు ప్రణాళికను అమలు చేయాలి: కలెక్టర్

క్షేత్రస్థాయిలో తాగునీటి సరఫరాకు రూపొందించిన కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో ఎంపీడీవోలు, తహసీల్దార్లు, తదితర అధికారులతో ఇందిరమ్మ ఇళ్లు, మిషన్ భగీరథ, తాగు నీరు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. వడదెబ్బ తగలకుండా తగిన రక్షణ చర్యలు తీసుకోవాలనే అంశంపై విస్తృత ప్రచార కార్యక్రమాలు చేపట్టాలన్నారు.
Similar News
News March 28, 2025
తెలంగాణ అన్ని మతాల ప్రజల సహా జీవనానికి ప్రతీక: కేటీఆర్

సికింద్రాబాద్ నియోజకవర్గంలోని బౌద్దనగర్ డివిజన్లోని వారసిగూడలో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో కే.టీ.రామారావు, సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఇఫ్తార్ విందులు సర్వ మత సౌభ్రాతృత్వాన్ని చాటుతాయని అన్నారు. తెలంగాణ అన్ని మతాల ప్రజల సహా జీవనానికి ప్రతీకని చెప్పారు.
News March 28, 2025
30 బంతుల్లో 31.. కోహ్లీపై ట్రోల్స్

చెన్నైతో మ్యాచులో విరాట్ కోహ్లీ ఇన్నింగ్సుపై సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయి. విరాట్ ఓపెనింగ్ వచ్చి 30 బంతుల్లో 31 రన్స్ చేసి ఔటయ్యారు. టీ20లో టెస్ట్ ఇన్నింగ్స్ ఆడారని ఎద్దేవా చేస్తున్నారు. చాలా షాట్లు కనెక్ట్ చేయలేకపోయారని పోస్టులు చేస్తున్నారు. పిచ్ కఠినంగా ఉందని, అక్కడ వేగంగా ఆడటం కష్టమని కోహ్లీ ఫ్యాన్స్ రిప్లైలు ఇస్తున్నారు. మరి ఇవాళ్టి కోహ్లీ ఇన్నింగ్సుపై మీ కామెంట్?
News March 28, 2025
కర్నూలు జిల్లా TODAY TOP NEWS..!

➤ ‘కిలోకి రూ.10 కమీషన్’ నిరూపిస్తే ఆస్తులు రాసిస్తా: ఆళ్లగడ్డ ఎమ్మెల్యే
➤ ఉమ్మడి కర్నూలు జిల్లాలో నలుగురికి నామినేటెడ్ పదవులు
➤ సీ.బెళగల్ వీఆర్వోపై టీడీపీ నేత దాడి
➤ రూ.14 లక్షలు పలికిన ఒంగోలు గిత్త
➤ ఆదోని: పెట్రోల్ బంకులో చోరీ.. రూ.90 వేలు మాయం
➤ హొలగుంద మండలంలో గ్యాస్ లీక్.. ఇల్లు దగ్ధం
➤ మంత్రాలయం నేతలకు వైసీపీలో పదవులు
➤ కుట్రలకు పాల్పడినా మాదే విజయం: ఎస్వీ మోహన్ రెడ్డి