News April 22, 2024

తాడిపత్రిలో జేసీ పవన్ కుమార్ రెడ్డి‌పై కేసు

image

తాడిపత్రిలో జేసీ పవన్ కుమార్ రెడ్డిపై కేసు నమోదు చేసినట్లు సీఐ మురళి కృష్ణ తెలిపారు. పట్టణంలో 19న టీడీపీ అభ్యర్థి జేసీ అస్మిత్ రెడ్డి నామినేషన్ సందర్భంగా యువకులు రెండు దొంగ ఓట్లు వేసి అయినా టీడీపీని గెలిపించాలని చేసిన వ్యాఖ్యలపై ఎంసీసీ టీం ఇన్‌ఛార్జ్ మున్సిపల్ కమిషనర్ రాంమోహన్ ఫిర్యాదు మేరకు జేసీ పవన్ కుమార్ రెడ్డిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

Similar News

News April 21, 2025

ATP: పోస్టులు 807.. పోటీ వేలల్లో..!

image

ఉమ్మడి అనంతపురం జిల్లాలో డీఎస్సీ పోస్టులకు తీవ్ర పోటీ నెలకొంది. జిల్లాకు 807 పోస్టులు మంజూరు కాగా టీచర్ ఉద్యోగాలకు సుమారు 40వేల మంది పోటీ పడనున్నట్లు సమాచారం. 202 ఎస్జీటీ పోస్టులకూ 24 వేల మందికిపైగా అభ్యర్థులు దరఖాస్తు చేసే అవకాశముంది. దీంతో ఒక్కో టీచర్ పోస్టుకు సగటున 40 మంది, ఒక్కో ఎస్జీటీ పోస్టుకు 120 మందికిపైగా పోటీ పడాల్సిన పరిస్థితి ఉందని అభ్యర్థులు చెబుతున్నారు.

News April 21, 2025

తమ్ముడి వివాహ నిశ్చయం కోసం వెళ్తూ..

image

ఉరవకొండలో ఆదివారం విషాద ఘటన జరిగింది. తమ్ముడి వివాహ నిశ్చయానికి వెళ్తూ రోడ్డు ప్రమాదంలో అక్క మృతి చెందింది. పట్టణానికి చెందిన ప్రవల్లిక తన తమ్ముడి వివాహ నిశ్చయం కోసం భర్త మల్లికార్జునతో కలిసి బైక్‌పై వజ్రకరూరు మండలం ఛాయాపురం గ్రామానికి బయలుదేరారు. ఈ క్రమంలో పట్టణ శివారులోని కళ్యాణ మండపం వద్ద ఆటో ఢీకొంది. ప్రవల్లిక అక్కడికక్కడే మృతి చెందగా భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించారు.

News April 21, 2025

రాప్తాడులో నేడు ప్రజా దర్బార్: కలెక్టర్

image

రాప్తాడు మండల కేంద్రంలో సోమవారం ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నట్లు అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. మండలంలో సమస్యలు ఉన్న ప్రజలు ప్రజాదర్బార్‌లో ఆర్జీలు సమర్పించి పరిష్కరించుకోవచ్చని తెలిపారు. అన్ని శాఖల అధికారులు హాజరవుతారన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

error: Content is protected !!