News March 15, 2025

తాడేపల్లిగూడెం చేరిన తండ్రి, పిల్లల మృతదేహాలు

image

కాకినాడ సుబ్బారావు నగర్లో తన ఇరువురు <<15765374>>పిల్లల్ని<<>> చంపి తాను ఆత్మహత్య చేసుకున్న సంఘటనలో తండ్రి వానపల్లి చంద్ర కిషోర్, పిల్లలు జోషిల్ (7), నిఖిల్ (6) భౌతిక కాయాలు శనివారం సాయంత్రం తాడేపల్లిగూడెం చేరుకున్నాయి. ఓఎన్జీసీ అంబులెన్స్ లో వారి భౌతిక కాయాలను తాడేపల్లిగూడెం పట్టణం పాతూరు అంబేడ్కర్ కమ్యూనిటీ హాల్ వెనుక ఉన్న మృతుడు చంద్రకిషోర్ తండ్రి సూరిబాబు నివాసానికి తీసుకొచ్చారు.

Similar News

News March 16, 2025

మొగల్తూరు: 8 ఏళ్ల బాలికపై అత్యాచారం

image

ప.గో జిల్లాలో బాలికపై అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. మొగల్తూరు SI నాగలక్ష్మి వివరాల ప్రకారం.. మండలంలోని ఓ గ్రామంలో 8 ఏళ్ల బాలికపై అదే ఊరికి చెందిన జయరాజు(34) అత్యాచారం చేశాడు. ఈ ఘటన 11వ తేదీన జరగ్గా.. బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నరసాపురం DSP శ్రీవేద ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగుతోంది.

News March 16, 2025

TPG: కన్నతండ్రే కిల్లర్‌లా చంపేశాడు..!

image

కన్నతండ్రే కిల్లర్‌లా ఇద్దరు చిన్నారులను చంపేసి తాను ఆత్మహత్య చేసుకున్న ఘటన కాకినాడలో జరిగిన విషయం తెలిసిందే. చంద్రకిశోర్ ఇద్దరి చిన్నారులను ప్రముఖ స్కూల్‌లో చదివిస్తున్నాడు. భవిష్యత్తులో లక్షలు కట్టి చదివించగలనా? అనే భయం మొదలైందని బంధువులు చెబుతున్నారు. ఒకేసారి ఇద్దరు పిల్లలకు కాళ్లుచేతులకు తాళ్లు ఎలా కట్టగలిగాడు? వారిని బాత్‌రూమ్‌లోకి తీసుకెళ్లి ఎలా చంపగలిగాడనేది అనుమానంగా ఉందని వారు చెప్పారు.

News March 16, 2025

చేబ్రోలు రైల్వే స్టేషన్లో గుర్తు తెలియని వ్యక్తి మృతి

image

ఉంగుటూరు మండలం చేబ్రోలు రైల్వే స్టేషన్ వెయిటింగ్ హాల్లో గుర్తు తెలియని వ్యక్తి (55) మృతి చెందినట్లు తాడేపల్లిగూడెం రైల్వే పోలీస్ స్టేషన్ SI అప్పారావు శనివారం తెలిపారు.‌ ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మృతుడు తెలుపు రంగుపై చిన్న గీతలు కలిగిన ఫుల్ హ్యాండ్ షర్టు, బిస్కెట్ రంగు ఫ్యాంటు ధరించి ఉన్నాడు. ఆచూకీ తెలిసిన వారు తాడేపల్లిగూడెం రైల్వే పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలని ఎస్సై సూచించారు.

error: Content is protected !!