News March 19, 2025
తిమ్మాపూర్: విద్యుత్తుషాక్తో నెమలి మృతి

తిమ్మాపూర్ మండలంలోని రామకృష్ణాపూర్ కాలనీలో విద్యుత్శాఖతో నెమలి మృతిచెందింది. గమనించిన గ్రామస్థులు ఫారెస్ట్ అధికారులకు సమాచారమందించారు. విషయం తెలుసుకున్న ఫారెస్ట్ అధికారులు నెమలి వద్దకు చేరుకుని విద్యుత్తీగలను పరిశీలించారు. అనంతరం నెమలిని పోస్టుమార్టం నిమిత్తం తీసుకెళ్లారు.
Similar News
News March 20, 2025
జగిత్యాల: ప్రేమ పేరుతో బాలికకు వేధింపులు.. పురుగు మందు తాగి ఆత్మహత్య

జగిత్యాల జిల్లాలో ఓ బాలికను ప్రేమ పేరుతో ఓ యువకుడు, బాలుడు వేధించగా ఆమె పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఎస్సై రవికిరణ్ వివరాల ప్రకారం.. పెగడపల్లి మండలం రామభద్రునిపల్లికి చెందిన బాలికను అదే గ్రామానికి చెందిన రాము అనే యువకుడు, రంగదామునిపల్లికి చెందిన మరో బాలుడు ప్రేమ పేరుతో వేధించారు. అది భరించలేక ఈనెల 15న బాలిక పురుగుల మందు తాగగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది.
News March 20, 2025
బడ్జెట్.. ఉమ్మడి కరీంనగర్కు కేటాయింపులు ఇలా..

రాష్ట్ర ప్రభుత్వం బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో KNR స్మార్ట్ సిటీ పనులకోసం రూ.179కోట్లు కేటాయించింది. అదేవిధంగా SUకి రూ.35కోట్లు, స్పోర్ట్స్ స్కూల్కు రూ.21కోట్లు, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్కు రూ.349.66కోట్లు, వరదకాలువల పనులకు 299.16కోట్లు, కాళేశ్వరం రూ.2,685కోట్లు, మానేరు ప్రాజెక్ట్కు రూ.లక్ష, బొగ్గులవాగు(మంథని)రూ.34లక్షలు, రామడుగు, గోదావరి బేసిన్కు రూ.2.23కోట్లను కేటాయించింది.
News March 20, 2025
KNR: విద్యార్థి దశలో అవకాశాలను అందిపుచ్చుకోవాలి: కలెక్టర్

నెహ్రూ యువజన కేంద్రం ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లాస్థాయి యువజన ఉత్సవం కార్యక్రమం తిమ్మాపూర్లోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కలెక్టర్ పమేలా సత్పతి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యార్థి దశలో స్వేచ్ఛ, అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు. ఈ దశలోనే చదువుతోపాటు సమాజసేవను అలవర్చుకోవాలన్నారు. విద్యార్థులు వాలంటీర్లుగా సేవలు అందించడం కూడా ముఖ్యమైన్నారు.