News April 22, 2025
తిరుపతయ్య కుటుంబీకులకు చెక్కు అందజేసిన ఎస్పీ

కాగజ్నగర్లో హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న తిరుపతయ్య ఇటీవల గుండెపోటుతో మరణించారు. కాగా ఆయన భార్య రాధికకు భద్రత ఎక్స్గ్రేషియా రూ.8,00,000, కార్పస్ ఫండ్ రూ.50,000, విడోస్ ఫండ్ రూ.10,000 చెక్కులను జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అందజేశారు. కానిస్టేబుల్ కుటుంబ స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వపరంగా చెందే ఇతర బెనిఫిట్లను అందేలా చూస్తామన్నారు.
Similar News
News April 23, 2025
పెనమలూరు: ఉరి వేసుకుని ఇంజినీరింగ్ విద్యార్థి మృతి

కృష్ణాజిల్లా పెనమలూరు మండలం కానూరులోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో ఉరివేసుకుని విద్యార్థిని మృతి చెందింది. ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్న యార్లగడ్డ ఖ్యాతి (20) హాస్టల్ రూమ్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పెనమలూరు పోలీసులు తెలిపారు.
News April 23, 2025
పార్వతీపురం: ‘వాట్సాప్ సేవలను ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలి’

రాష్ట్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చిన వాట్సాప్ సేవలను ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మన మిత్ర (వాట్సాప్ గవర్నెన్స్) 9552300009కు “హాయ్” అనండి..హాయిగా సేవలు పొందండి అన్నారు. ప్రభుత్వ వాట్సాప్ నంబరు 9552300009ను మన మిత్ర పేరుతో సేవ్ చేసుకోవాలన్నారు.
News April 23, 2025
HYD: గురుకుల విద్యార్థికి స్టేట్ ఫస్ట్ ర్యాంక్

మైనార్టీ గురుకులానికి చెందిన ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ విద్యార్థి ఎండీ. ఫర్హాన్కు CEC విభాగంలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ లభించింది. TMRJC ఖైరతాబాద్కు చెందిన ఫర్హాన్కు 500 మార్కులకు గాను 495 మార్కులు వచ్చాయి. ప్రణాళిక ప్రకారం చదవడం, అధ్యాపకుల ప్రోత్సాహం కారణంగా ఈ ర్యాంక్ వచ్చినట్టు ఫర్హాన్ తెలిపారు. దీంతో విద్యార్థికి కళాశాల అధ్యాపకులు, తోటి మిత్రులు శుభాకాంక్షలు తెలిపారు.