News February 1, 2025
తిరుపతి జిల్లాలో 59.7 శాతం పెన్షన్ల పంపిణీ
తిరుపతి జిల్లా వ్యాప్తంగా సామాజిక పెన్షన్ పంపిణీ కార్యక్రమం శనివారం ఉదయం నుంచి ప్రారంభమైంది. జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో కలిపి ఉదయం 9.40 గంటలకు అధికారులు తెలిపిన వివరాల మేరకు 59.7 శాతం పంపిణీ పూర్తి అయినట్లు వెల్లడించారు. తొలి స్థానంలో 79.24 శాతంతో తిరుపతి మున్సిపాలిటీ ఉంది. చివరి స్థానంలో 46.13 శాతంతో కోట ఉందని అధికారులు తెలిపారు.
Similar News
News February 1, 2025
రేపు పెద్దగట్టు ఆలయం వద్ద దిష్టి పూజ
పెద్దగట్టు జాతర వద్ద ఆదివారం దిష్టి పూజ నిర్వహించనున్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే 2వ అతిపెద్ద జాతరైన పెద్దగట్టు లింగమంతుల ఫిబ్రవరి 16 నుంచి 20 వరకు జరుగనున్న విషయం తెలిసిందే. ఆదివారం అర్ధరాత్రి దిష్టి పూజ నిర్వహిస్తారని పెద్దగట్టు ఛైర్మన్ నర్సయ్య యాదవ్ తెలిపారు. భక్తులకు ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు.
News February 1, 2025
కేంద్ర బడ్జెట్లో ఏపీకి కేటాయింపులు ఇలా..
ఏపీకి స్పెషల్ ప్యాకేజీ కింద 2024 DEC 24 వరకు రూ.3,685.31 కోట్లు విడుదల చేసినట్లు కేంద్రం పేర్కొంది. అలాగే బడ్జెట్లో పలు కేటాయింపులు చేసింది.
* పోలవరం ప్రాజెక్టుకు రూ.5,936cr
* ప్రాజెక్ట్ నిర్మాణానికి బ్యాలెన్స్ గ్రాంటు రూ.12,157cr
* విశాఖ స్టీల్ ప్లాంట్కు రూ.3,295cr
* విశాఖ పోర్టుకు రూ.730cr
* ఆరోగ్య వ్యవస్థల బలోపేతానికి: రూ.162cr
* జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్కు: రూ.186cr
News February 1, 2025
భారీ ఎన్కౌంటర్.. 8 మంది మృతి
ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. బీజాపూర్ జిల్లా గంగలూర్ అటవీ ప్రాంతంలో ఎదురుకాల్పులు జరగ్గా 8 మంది మావోయిస్టులు మృతిచెందారు. ఈ ప్రాంతంలో ఇవాళ ఉదయం నుంచి పోలీసులు, మావోయిస్టులకు మధ్య కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. అటవీ ప్రాంతంలో పోలీసుల కూంబింగ్ కొనసాగుతూనే ఉంది.