News February 4, 2025

తిరుపతి: రేపటి నుంచి ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు

image

తిరుపతి జిల్లా వ్యాప్తంగా ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకి ప్రాక్టీకల్ పరీక్షలు జరగనున్నాయి. జనరల్ 24,927 మందికి 124 కేంద్రాలు, ఓకేషనల్ 2,355 మందికి 23 కేంద్రాల్లో పరీక్షలు జరుగుతాయని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. ఉదయం 9 నుంచి 12 వరకు, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు పరీక్షలు వివిధ సెషన్స్‌గా పరీక్షలు ఆఫ్ లైన్ విధానంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని వివరించారు.

Similar News

News February 4, 2025

రైతులకు ‘సోలార్’ పంట.. అప్లై చేసుకోండిలా

image

TG: ‘PM కుసుమ్’ స్కీమ్ కింద సాగుకు యోగ్యం కాని భూముల్లో సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకునే రైతులకు ప్రభుత్వం లోన్లు ఇవ్వనుంది. దీనికోసం ఈనెల 22లోగా రెడ్‌కో <>సైట్‌లో<<>> అప్లై చేసుకోవాలని అధికారులు సూచించారు. ఒక్కో చోట 500kW నుంచి 2MW ఉత్పత్తి చేసేలా ప్యానెల్స్ ఏర్పాటు చేసుకోవచ్చు. 1MW ఉత్పత్తికి 3-4 ఎకరాల భూమి అవసరం అవుతుంది. kW పవర్‌కు ₹3.13 చెల్లించి ప్రభుత్వమే విద్యుత్‌ను కొనుగోలు చేస్తుంది.

News February 4, 2025

జంగంపల్లి చెరువులో మృతదేహం కలకలం

image

బిక్కనూర్ మండలం జంగంపల్లి పెద్ద చెరువులో మంగళవారం గుర్తు తెలియని శవాన్ని స్థానికులు గుర్తించారు. స్థానికులు గ్రామపంచాయతీ సిబ్బందికి సమాచారం అందించగా పంచాయతీ కార్యదర్శి గుడిసె బాబు ఘటనా స్థలాన్ని పరిశీలించి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతుని వివరాలు తెలియాల్సి ఉంది.

News February 4, 2025

బషీరాబాద్‌లో దారుణ హత్య

image

బషీరాబాద్ మండలంలోని నవల్గా గ్రామ శివారులో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. బండరాళ్లతో మోది మాల శ్యామప్పను చంపేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

error: Content is protected !!