News September 21, 2024
తిరుమల బాలాజీ నగర్ లో కార్డన్ సర్చ్
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు సమీపిస్తున్న క్రమంలో టీటీడీ, పోలీసు అధికారులు ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో శనివారం తెల్లవారుజామున 5 గంటల నుంచి స్థానికులు నివసించే తిరుమల బాలాజీ నాగర్ లో భద్రతా బలగాలతో కార్డన్ సర్చ్ నిర్వహించారు. స్థానికుల వివరాలతో పాటు ఆధారాలను పరిశీలించారు. అనుమానాస్పద వ్యక్తులపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు అధికారులు తెలిపారు.
Similar News
News September 21, 2024
విద్యుత్ షాక్ తగిలి రైల్వే ఉద్యోగి మృతి
రైల్వే స్టేషన్ విధులు నిర్వహిస్తున్న క్రమంలో విద్యుత్ షాక్ గురై రైల్వే ఉద్యోగి శనివారం మృతి చెందాడు. రేణిగుంట రైల్వే స్టేషన్లో భరత్ అనే ఉద్యోగి విద్యుత్ తీగల మరమ్మతులు నిర్వహిస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు హై టెన్షన్ తీగలు తగిలి కుప్పకూలాడు. దీంతో తోటి సిబ్బంది హుటాహుటిన రైల్వే ఆసుపత్రికి తరలించారు. అప్పటికే భరత్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
News September 21, 2024
తిరుపతి ఆర్డీవో నిశాంత్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
పెట్రోల్ బంకు క్లియరెన్స్లో లంచం డిమాండ్ చేశారన్న ఆరోపణలపై తిరుపతి ఆర్డీవో నిశాంత్ రెడ్డిను సస్పెండ్ చేస్తున్నట్లు రెవెన్యూశాఖ ప్రత్యేక కార్యదర్శి సిసోదియా శుక్రవారం రాత్రి ఆదేశాలు జారీ చేశారు. పుత్తూరు పెట్రోల్ బంకు ఎన్ఓసీకి రూ.లక్ష డిమాండ్ చేసినట్లు ఆరోపణలు రావడంతో ప్రభుత్వం విచారణ చేపట్టింది. విచారణలో నిజమని తేలడంతో ఆయనపై వేటు వేసింది.
News September 20, 2024
సదుం: నాలుగేళ్ల చిన్నారి మృతి
అనారోగ్యంతో నాలుగేళ్ల చిన్నారి మృతి చెందిన ఘటన సదుం మండలంలో శుక్రవారం జరిగింది. జాండ్రపేటకు చెందిన షేహాన్ షా కుమార్తె సభా పర్వీన్ ఐదు రోజులుగా జ్వరంతో బాధపడుతూ పీలేరులో చికిత్స పొందింది. ఈ క్రమంలో నేడు మళ్లీ చిన్నారి హఠాత్తుగా అస్వస్థతకు గురి కావడంతో 108 వాహనంలో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. చిన్నారి మృతితో గ్రామంలో విషాదం నెలకొంది.