News September 21, 2024
తిరుమల లడ్డూ కల్తీపై చర్యలు తీసుకోవాలి: ఎంపీ రఘునందన్
తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడకం దారుణమని, బాధ్యులు ఎవరైనా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని కఠిన చర్యలు తీసుకోవాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు పేర్కొన్నారు.ఈ మేరకు ఎంపీ Xలో పోస్టు చేశారు. పవిత్రతకు మారుపేరైన వెంకటేశ్వర స్వామి ప్రసాదం కల్తీ చేయడం క్షమించరాని నేరం అన్నారు. 2019 నుంచి 2024 వరకు తిరుమలలో జరిగిన ఘటనలపై కేంద్ర ప్రభుత్వం దృష్టిసారించి చర్యలు తీసుకోవాలన్నారు.
Similar News
News September 21, 2024
నర్సాపూర్: డిపో సరే.. డ్రైవర్లు ఎక్కడా?
నర్సాపూర్లో ఆర్టీసి డిపో ఏర్పాటు కావడంతో ఇక తమ ప్రయాణ కష్టాలు తీరుతాయని ఈ ప్రాంత వాసులు ఆశించారు. అయితే ప్రయాణికుల అవసరాలకు తగినట్లు బస్సులు నడపకపోవడంతో అధికారులు విఫలమవుతున్నారు. డిపోలో ఉన్నా బస్సులకు అనుగుణంగా మొత్తం 45 మంది డ్రైవర్లకు 36 మంది ఉన్నారు. దీంతో సరైన రూట్లో బస్సులు నడువక అనేక ఇబ్బందులు ఎదుర్కుంటున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
News September 21, 2024
కొండా లక్ష్మణ్బాపూజీ తెలంగాణకు నిత్యస్ఫూర్తి: కేసీఆర్
తెలంగాణ అస్తిత్వం, ఆత్మగౌరవం కోసం తన జీవితకాలం పోరాడిన తొలితరం నేత కొండా లక్ష్మణ్ బాపూజీ అని, ఆయన తెలంగాణకు నిత్యస్ఫూర్తి అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ కోసం మంత్రి పదవిని త్యాగం చేసిన బాపూజీ స్ఫూర్తి తాను సాగించిన చివరిదశ తెలంగాణ సాధన పోరాటంలో ఇమిడి ఉన్నదని తెలిపారు. కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతిని పురస్కరించుకొని వారి కృషిని కేసీఆర్ స్మరించుకున్నారు.
News September 21, 2024
బెజ్జంకి: కుటుంబ కలహాలో తల్లీ, కూతురు ఆత్మహత్య
సిద్దిపేట జిల్లా బెజ్జంకిలో తీవ్ర విషాదం నెలకొంది. ఓ తల్లి తన కూతురితో సహా సూసైడ్ చేసుకుంది. స్థానికుల సమాచారం.. జనగాం జిల్లాకు చెందిన రాజు జీవనోపాధి కోసం కుటుంబంతో కలిసి బెజ్జంకి మండలానికి వలస వచ్చి కూలీ పనులు చేస్తున్నారు. రాజు మద్యానికి బానిసై తరుచుగా భార్య శారద, పిల్లలతో గొడవ పడేవాడు. గురువారం అర్ధరాత్రి సైతం గొడవ పడగా మనస్తాపానికి గురై శారద కుమార్తెతో సాహ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది.