News October 4, 2024

తిరుమలకు చేరుకున్న మంత్రి ఆనం

image

సీఎం చంద్రబాబు ఈరోజు సాయంత్రం శ్రీవారికి కుటుంబ సమేతంగా పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఈ నేపథ్యంలో ఏర్పాట్లను ప్రత్యక్షంగా పర్యవేక్షించేందుకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తిరుమలకు చేరుకున్నారు. ఆయనను టీటీడీ ఈవో శ్యామల రావు, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి మర్యాదపూర్వకంగా కలిసి ఏర్పాట్లను వివరించారు.

Similar News

News October 5, 2024

నేడు, రేపు ఆర్టీసీ బస్సు పాసుల జారీ నిలిపివేత

image

ఏపీఎస్‌ఆర్టీసీలో సాఫ్ట్‌వేర్‌ను అప్డేట్ చేస్తున్న కారణంగా.. శని, ఆదివారాల్లో (5, 6 తేదీలు) అన్ని రకాల బస్సు పాసులు నిలిపివేస్తున్నామని ఆత్మకూరు డిపో మేనేజర్ కరీమున్నీసా తెలిపారు. సోమవారం నుంచి కౌంటర్లలో బస్సు పాసులు జారీ చేస్తామని చెప్పారు. ప్రయాణికులు, విద్యార్థులు ఆర్టీసీ సంస్థకు సహకరించాలని కోరారు.

News October 5, 2024

నెల్లూరు: టీడీపీలో చేరిన కార్పొరేటర్ విజయభాస్కర్ రెడ్డి

image

నెల్లూరు రూరల్ నియోజకవర్గం 22వ డివిజన్ కార్పొరేటర్ మూలే విజయభాస్కర్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఆయనతో పాటు మిత్రబృందానికి టీడీపీ కండువాలు కప్పి ఆత్మీయ ఆహ్వానం పలికారు. నిరంతరం ప్రజల్లో ఉంటూ, వారి కోసం పనిచేయాలని శ్రీధర్ రెడ్డి పిలుపునిచ్చారు.

News October 4, 2024

రైల్వే ప్రాజెక్టులపై ఎంపీ వీపీఆర్ చర్చ

image

విజయవాడలోని సత్యనారాయణపురం ఈటీటీ సెంటర్‌లో దక్షిణ మధ్య రైల్వే అధికారుల సమావేశం శుక్రవారం జరిగింది. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సమావేశానికి హాజరై పలు అంశాలను ప్రస్తావించారు. జిల్లాలో దుస్థితిలో ఉన్న రైల్వే స్టేషన్ల అభివృద్ధి, నడికుడి రైల్వే లైను తదితర అంశాలపై చర్చించారు.