News February 27, 2025

తూ.గో: నేడే MLC ఎలక్షన్.. సర్వం సిద్ధం

image

ఉమ్మడి తూ.గో.జిల్లాలో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నేడు ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు పోలింగ్ కేంద్రాల వద్ద అధికార యంత్రాంగం ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేసింది. దీంతో పోలింగ్ జరగనున్న ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలులో ఉండనుంది. గోదావరి జిల్లాల్లో 456 పోలింగ్ కేంద్రాలు సిద్ధం చేశారు. 70 జోన్లలో 70 జోనల్ అధికారులు, 95మంది రూట్ ఆఫీసర్లను నియమించారు.

Similar News

News February 27, 2025

జగిత్యాల: 12 pm వరకు పోలింగ్ శాతం నమోదు వివరాలు

image

జగిత్యాల జిల్లాలో పట్టభద్రుల, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ శాతం గురువారం మధ్యాహ్నం 12 గంటల వరకు నమోదైన వివరాలు ఇలా ఉన్నాయి. టీచర్ ఎమ్మెల్సీకి 39.12 శాతం ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోగా.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు 20.10శాతం వినియోగించుకున్నట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. మొత్తంగా రెండు కలిపి 21 శాతం పోలింగ్ నమోదు అయినట్లు పేర్కొన్నారు.

News February 27, 2025

MTM: సెయింట్ ఫ్రాన్సిస్‌లో ఓటు వేసిన కలెక్టర్

image

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కలెక్టర్ డీకే బాలాజీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మచిలీపట్నం సెయింట్ జాన్స్ హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో కలెక్టర్ ఓటు వేశారు. ఓటు వేసిన అనంతరం పోలింగ్ జరుగుతున్న తీరును పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. కాగా పోలీసులు పోలింగ్ కేంద్రం వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. 

News February 27, 2025

లైవ్ వెబ్ కాస్టింగ్ ద్వారా ఎన్నికల సరళిని పరిశీలించిన WGL కలెక్టర్

image

వరంగల్ కలెక్టర్లో ఏర్పాటు చేసిన లైవ్ వెబ్ కాస్టింగ్ ద్వారా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సరళిని జిల్లా కలెక్టర్ సత్య శారద పరిశీలించారు. జిల్లాలో 13 పోలింగ్ కేంద్రాల్లో జరుగుతున్న పోలింగ్ కేంద్రాల ఓటింగ్ విధానంపై ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షిస్తున్నారు. ఏమైనా అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

error: Content is protected !!