News May 22, 2024
తూ.గో.: పవన్ పోటీ.. అందరి చూపూ ఇటువైపే

ఉమ్మడి తూ.గో.లోని 19నియోజకవర్గాల్లో 2019 ఎన్నికల్లో వైసీపీ 14 చోట్ల గెలిచింది. 4 స్థానాల్లో టీడీపీ, ఒకచోట (రాజోలు) జనసేన పాగా వేసింది. తాజాగా పిఠాపురం నుంచి పవన్ పోటీచేయడంతో అందరి దృష్టి అటువైపు మళ్లింది. కాగా పొత్తులో భాగంగా జనసేన ఈ సారి 5 చోట్ల పోటీచేసింది. మరి గతంలో జనసేన గెలిసిన ఏకైక స్థానం ఈ జిల్లాలోనే కాగా.. ఈ సారి సీట్లు పెరిగేనా.?
– ఉమ్మడి తూ.గో.లో కూటమికి ఎన్నిసీట్లు రావొచ్చు..?
Similar News
News April 23, 2025
10th RESULTS: 6వ స్థానంలో తూర్పు గోదావరి

పదో తరగతి పరీక్షా ఫలితాల్లో తూర్పు గోదావరి జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. మొత్తం 23,388 మంది పరీక్ష రాయగా 20,578 మంది పాసయ్యారు. 11,975 మంది బాలురులో 10,310 మంది, 11,413 మంది బాలికలు పరీక్ష రాయగా 10,268 మంది పాసయ్యారు. 87.99% పాస్ పర్సంటైల్తో తూర్పు గోదావరి 6వ స్థానంలో నిలిచింది.
News April 23, 2025
రాజమండ్రి: స్పా ముసుగులో వ్యభిచారం

రాజమండ్రిలో స్పాముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ స్పా సెంటర్పై పోలీసులు దాడులు నిర్వహించారు. SI ఆదినారాయణ వివరాల ప్రకారం.. బ్యూటీషియన్ కోర్సు నేర్పిస్తామని చెప్పి యువతులకు ఎరవేసి వ్యభిచారం నిర్వహిస్తున్నారు. SIకు వచ్చిన సమాచారంతో సిబ్బందితో కలిసి దాడి చేశారు. ఐదుగురు యువతులు, ఐదుగురు విటులు పట్టుబడ్డారు. స్పా నిర్వాహకుడు మదన్, మేనేజర్ తేజశ్రీని అరెస్టు చేసి కేసు దార్యప్తు చేస్తున్నారు.
News April 22, 2025
తాళ్లపూడి: పుష్కరాల రేవులో శిశువు మృతదేహం లభ్యం

తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి పుష్కరాల స్నాన ఘట్టానికి వెళ్లే మార్గంలో ఆడ శిశువు మృతదేహాన్ని మంగళవారం స్థానికులు కనుగొన్నారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కొవ్వూరు సీఐ విజయబాబు ప్రాంతాన్ని సందర్శించి శిశువు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆడ శిశువు మృతదేహం లభ్యమవ్వడంతో చుట్టుపక్కల ప్రైవేట్ ప్రభుత్వ ఆసుపత్రులలో పోలీసులు విచారణ చేపట్టారు.