News April 4, 2025

తూప్రాన్: ప్రాపర్టీ టాక్స్ వసూళ్లలో అవార్డు

image

తూప్రాన్ మున్సిపాలిటీకి ప్రాపర్టీ టాక్స్ వసూళ్లలో లక్ష్యాన్ని సాధించినందుకు బెస్ట్ అప్రిసియేషన్ అవార్డు దక్కింది. ఈరోజు హైదరాబాదులో సీడీఎంఏ అధికారి చేతుల మీదుగా బెస్ట్ అప్రిసియేషన్ అవార్డును కమిషనర్ పాతూరి గణేష్ రెడ్డి అందుకున్నారు. 2024-25 సంవత్సరానికి 82.17% ప్రాపర్టీ టాక్స్ వసూలు చేశారు. అవార్డు లభించినందుకు మేనేజర్ రఘువరన్, వార్డు అధికారులు, సిబ్బందిని అభినందించారు.

Similar News

News April 12, 2025

నర్సాపూర్: కన్న తండ్రిపై కత్తితో దాడి చేసిన కొడుకు

image

నర్సాపూర్ మండలం చిన్నచింతకుంట గ్రామంలో దారుణం జరిగింది. గ్రామానికి చెందిన వడ్ల దశరథంపై సొంత కుమారుడు వడ్ల నాగరాజు కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడ్డ దశరథ్‌ను ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దశరథం పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. భూమి పంచి ఇవ్వడం లేదంటూ తండ్రిపై నాగరాజు దాడి చేసినట్టు తెలుస్తోంది. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు.

News April 12, 2025

మెదక్ జిల్లాలో ఎండలు మండుతున్నాయ్..

image

మెదక్ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. నిన్న పాపన్నపేట, మెదక్‌లో అత్యధికంగా 40.9 డిగ్రీలు నమోదైనట్లు వాతావరణం శాఖ అధికారులు వెల్లడించారు. హవేలిఘనపూర్ 40.8, టేక్మాల్ 40.6, వెల్దుర్తి 40.1, కుల్చారం 39.9, నిజాంపేట్, చేగుంట 39.7, కౌడిపల్లి 39.6, రామయంపేట్ 39.4, నర్సాపూర్ 39.3°C ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండలో తీవ్రత దృష్ట్యా చిన్నారులు, వృద్ధులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

News April 12, 2025

దరిపెల్లి రామయ్య మృతి తీరని లోటు: హరీశ్ రావు

image

ప్రకృతి ప్రేమికుడు, హరిత స్వాప్నికుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి దరిపెల్లి రామయ్య మృతి తీరని లోటుని ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. ఇంటిపేరునే వనజీవిగా మార్చుకొని కోట్లాది మొక్కలకు ప్రాణం పోశారాని, పర్యావరణ హితమే తన ఊపిరిగా భావించిన ఆయన నేడు మన మధ్య లేకపోవడం బాధాకరం Xలో పేర్కొన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

error: Content is protected !!