News August 17, 2024
త్వరలో HYDలో బెంగళూరు మోడల్!
HYD నగరంలో పలు ప్రాంతాల నుంచి డైరెక్ట్ మెట్రో స్టేషన్ల పాయింట్ల వద్దకే బస్ సర్వీస్ ప్రారంభించి ఆదాయం పెంచుకోవడంపై మెట్రో దృష్టి పెట్టింది .బెంగళూరులో మెట్రో ఫీడర్ బస్ సర్వీస్ పాయింట్లను పెంచడం ద్వారా మెట్రో ప్రయాణికుల సంఖ్య పెరగడంతో అదే మోడల్ HYDలో అమలు చేయాలని యోచిస్తోంది. గతేడాది బెంగళూరులో డిసెంబర్ వరకు 65 స్టేషన్లలో రోజుకు 5.60 లక్షల మంది ప్రయాణించగా.. ప్రస్తుతం 6.8-7.50 లక్షలకు పెరిగారు.
Similar News
News September 30, 2024
HYD: మూసీ వద్ద మార్కింగ్, సర్వేకు హైడ్రాకు సంబంధం లేదు: రంగనాథ్
HYD: మూసీ నదికి ఇరువైపులా సర్వేలతో హైడ్రాకు సంబంధం లేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. అక్కడి నివాసితులను హైడ్రా తరలించడంలేదని, అక్కడ ఎలాంటి కూల్చివేతలు హైడ్రా చేపట్టడంలేదన్నారు. మూసీ పరీవాహక ప్రాంతంలోని ఇళ్లపై హైడ్రా మార్కింగ్ చేయడంలేదని, మూసీ సుందరీకరణ ప్రత్యేక ప్రాజెక్టని తెలిపారు. దీనిని మూసి రివర్ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చేపడుతోందని ప్రకటించారు.
News September 30, 2024
HYD: మూసీ నిర్వాసితులపై BRS మొసలి కన్నీళ్లు: మంత్రి
మూసీ నిర్వాసితులపై బీఆర్ఎస్ వాళ్లు మొసలి కన్నీళ్లు కారుస్తున్నారని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు విమర్శించారు. HYDలో ఆయన మాట్లాడుతూ.. హైడ్రా అంశాన్ని బీఆర్ఎస్ భూతద్దంలో పెట్టి చూపించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. గతంలో రైతు సోదరులపై బుల్డోజర్లు పంపించింది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని మండిపడ్డారు. మూసీ నిర్వాసితులకు తాము అండగా ఉంటామని, HYDను బెస్ట్ సిటీగా మారుస్తామని స్పష్టం చేశారు.
News September 30, 2024
HYD: మార్పు చెందకపోతే మనుగడ కష్టమే: ఇస్రో ఛైర్మన్
HYD బాలనగర్ నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్(NRSC) ప్రపంచ వ్యాప్తంగా అనేక సేవలు అందించినట్లు ISRO ఛైర్మన్ సోమనాథ్ తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా వస్తోన్న మార్పులకు అనుగుణంగా మారకపోతే రిమోట్ సెన్సింగ్ మనుగడ కష్టమేనన్నారు. సాంకేతికతలో వేగంగా మార్పులు వస్తున్నాయని, సమాచారం అత్యంత వేగంగా కావాలని ప్రజలు, వ్యవస్థలు కోరుకుంటున్నాయన్నారు. రాబోయే 25 ఏళ్లకు వచ్చే మార్పులను అంచనా వేసి నివేదిక రూపొందించాలన్నారు.