News November 22, 2024
త్వరలో విద్యార్థులకు ఆరోగ్య కార్డులు: కలెక్టర్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_112024/1732272698640_51570700-normal-WIFI.webp)
శ్రీ సత్యసాయి జిల్లాలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో డిసెంబర్ 7న మెగా పేరెంట్స్, టీచర్ల సమావేశం నిర్వహించాలని కలెక్టర్ చేతన్ తెలిపారు. విజయవాడ నుంచి విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి కోన శశిధర్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన పాల్గొన్నారు. చదువుకునే విద్యార్థులకు ఆరోగ్య కార్డులు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ప్రయోగాత్మకంగా నియోజకవర్గానికి 5 పాఠశాలలు ఎంపిక చేసి అందించనున్నట్లు వెల్లడించారు.
Similar News
News December 27, 2024
మన్మోహన్ సింగ్.. శ్రీ సత్యసాయి బాబా భక్తుడు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_122024/1735236823124_51780396-normal-WIFI.webp)
శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తికి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ బాబా దర్శనం కోసం వచ్చేవారు. 2010లో సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ 29వ కాన్విగివేషన్ సర్టిఫికెట్ల ప్రదానం కార్యక్రమానికి ఆయన అతిథిగా వచ్చారు. అనంతరం 2011లో సత్యసాయి బాబా మరణించిన రోజు వచ్చి కన్నీటి పర్వతమయ్యారు. 2016లో సత్యసాయి బాబా మహా సమాధిని దర్శించుకున్నారు.
News December 27, 2024
అటవీ సంరక్షణ కమిటీతో కలెక్టర్ చేతన్ సమీక్ష
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_122024/1735210542282_51570700-normal-WIFI.webp)
శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ చేతన్ జిల్లా స్థాయి అటవీ సంరక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశానికి జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, జిల్లా ఎస్పీ రత్న హాజరయ్యారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణకు హాని జరగకుండా చూడాలని ఆదేశించారు. వచ్చే ఏడాది మార్చిలో చెట్లు నాటే కార్యక్రమానికి అవసరయ్యే మొక్కలకు నర్సరీలు ఏర్పాటు చేసి పెంచాలని సూచించారు.
News December 27, 2024
అనంతపురం జిల్లాతో మన్మోహన్ సింగ్కు అనుబంధం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_122024/1735235948645_51780396-normal-WIFI.webp)
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు అనంతపురం జిల్లాతో అనుబంధం ఉంది. 2006లో నార్పల మండలంలోని బండ్లపల్లి నుంచే దేశంలోనే తొలిసారిగా ఉపాధి హామీ పథకాన్ని అప్పటి యూపీఏ ఛైర్ పర్సన్ సోనియా గాంధీతో కలిసి ప్రారంభించారు. ఆ పథకం ప్రారంభించిన పదేళ్ల తర్వాత 2016లో ఆయన రాహుల్ గాంధీతో కలిసి జిల్లాకు వచ్చారు. అప్పటి పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ఆధ్వర్యంలో బండ్లపల్లిలో ప్రజలతో మమేకమై ఉపాధిహామీ సమస్యలను తెలుసుకున్నారు.