News January 24, 2025

దరఖాస్తుల వివరాలను ఆన్‌లైన్‌లో జాగ్రత్తగా నమోదు చేయాలి: కలెక్టర్

image

ప్రజాపాలన గ్రామ/వార్డు సభల అభ్యంతరాల దరఖాస్తుల వివరాలను ఆన్‌లైన్‌లో జాగ్రత్తగా నమోదు చేయాలని జనగామ కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని మండల పరిషత్, తహశీల్దార్ కార్యాలయాల్లో జరుగుతున్న ప్రజాపాలన గ్రామ/వార్డు సభల్లో వచ్చిన రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా సర్వే పరిశీలన, అభ్యంతరాల దరఖాస్తుల వివరాల ఆన్‌లైన్ నమోదు ప్రక్రియను పర్యవేక్షించారు.

Similar News

News March 13, 2025

భూ ఆక్రమణ కేసుల విచారణ వేగవంతం చేయాలి: కలెక్టర్

image

భూ అక్రమాలపై నమోదైన కేసుల విచారణ వేగవంతం చేయాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరు తమీమ్ అన్సారియా, జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ, అడిషనల్ ఎస్పీ నాగేశ్వర రావులతో కలసి భూ అక్రమాలపై నమోదైన కేసుల విచారణ పురోగతిపై సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. భూఅక్రమాలపై నమోదైన కేసుల విచారణ వేగవంతం చేయాలని పోలీసు అధికారులకు సూచించారు.

News March 13, 2025

అల్లూరి జిల్లాలో టుడే టాప్ న్యూస్

image

> కోయ్యూరులో అర్థరాత్రి మార్గమధ్యలో ప్రసవం
>జిల్లాలో భూములు రిజిస్ట్రేషన్ చేయండి
>దేవీపట్నంలో పెళ్లి రోజే ఆమెకు చివరి రోజు
>అల్లూరిలో ఇంటర్ పరీక్షలకు 301మంది గైర్హాజరు
>రంపచోడవరంలో జీడిపిక్కలు కొనుగోలు చేస్తాం
>రాజవొమ్మంగిలో ఠారెత్తిస్తున్న ఎండలు..నిర్మానుష్యంగా రహదారులు
>పాడేరు జనసేన నేతపై దాడి..కేజీహెచ్‌కు తరలింపు
>అరకులో పర్యటించిన సీఆర్డీ జాయింట్ కమిషనర్

News March 13, 2025

‘శ్రీ సత్య సాయి జిల్లాను నేర రహిత జిల్లాగా మారుద్దాం’

image

శ్రీ సత్య సాయి జిల్లాని నేర రహిత జిల్లాగా మారుద్దామని ఎస్పీ రత్న పేర్కొన్నారు. గురువారం సాయంత్రం హిందూపురం సమీపంలోని అప్పలకొండ క్రాస్ వద్ద డీఎస్పీ మహేశ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం మహిళలకు పురుషులతో పాటు సమాన హక్కులు కల్పించిందని పేర్కొన్నారు. హక్కులను వినియోగించుకొని జిల్లాలను నేర రహిత జిల్లాగా మారుద్దాం అన్నారు.

error: Content is protected !!