News February 4, 2025

దర్శి: గుప్తనిధుల కోసం తవ్వకాలు

image

దర్శి మండలం శివరాజ్ నగర్ శివారులోని శ్రీ సాయిబాబా గుడి శ్రీ దత్తాశ్రమం పక్కనగల కొండ పైన గుర్తుతెలియని కొందరు వ్యక్తులు గుప్తనిధుల కొరకు కొండను తవ్వుతున్నారన్న సమాచారం మేరకు దర్శి ఎస్ఐ మురళి తన సిబ్బందితో దాడి చేశారు. ఈ క్రమంలో ఐదుగురు కొండను తవ్వుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ మురళి తెలిపారు.

Similar News

News February 4, 2025

ఒంగోలు: వైసీపీలో ఉండేది ఎవరు.?

image

ఒంగోలు కార్పొరేషన్ రాజకీయం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. బాలినేని శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో బుధవారం పవన్ కళ్యాణ్ సమక్షంలో పలువురు వైసీపీ కార్పొరేటర్లు జనసేన తీర్థం పుచ్చుకోనున్నట్లు జిల్లాలో జోరుగా చర్చ సాగుతుంది. దీంతో వైసీపీలో ఉండే కార్పొరేటర్లు ఎంత మంది అనేది ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. కార్పొరేటర్లలో అత్యధికులు బాలినేనికి సన్నిహితులు కావడం గమనార్హం.

News February 4, 2025

ప్రకాశం: రెండు రోజుల్లో ఇద్దరు మృతి

image

గత రెండు రోజులుగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రకాశం జిల్లాలో ఇద్దరు మృతి చెందారు. ఆదివారం పామూరు మండలం గోపాలపురంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అల్లూరి జిల్లాకు చెందిన అశోక్ (21) అనే యువకుడు మృతి చెందాడు. జరుగుమల్లి మండలం పచ్చవకు చెందిన మాలకొండయ్య (60) పొలం చూసుకుని బైక్‌పై ఇంటికి వస్తుండగా మరో బైక్ ఢీకొనడంతో ఆయన మృతి చెందారు.

News February 4, 2025

యర్రగొండపాలెం టీడీపీ ఇన్‌ఛార్జ్‌పై IVR సర్వే

image

యర్రగొండపాలెం టీడీపీ ఇన్‌ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబుపై అధిష్టానం IVR సర్వే చేపట్టింది. గూడూరి ఎరిక్షన్ బాబు పనితీరుపై మీ అభిప్రాయం తెలియజేయండి అంటూ నియోజకవర్గ టీడీపీ శ్రేణులకు ఫోన్‌లు రావడంతో నియోజకవర్గంలో హాట్ టాపిక్‌గా మారింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా అధిష్టానం సర్వే నిర్వహిస్తుందని, అందులో భాగంగానే యర్రగొండపాలెం ఇన్‌ఛార్జ్ పనితీరుపై సర్వే జరుగుతుందని ఈ పార్టీ శ్రేణులు తెలుపుతున్నాయి.

error: Content is protected !!