News December 1, 2024

దళిత సమ సమాజ నిర్మాణానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి దామోదర్

image

రాష్ట్రంలో దళిత సమ సమాజ నిర్మాణం కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా అమిస్తాపూర్‌లో నిర్వహించిన రైతు పండుగ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. సమగ్ర కుటుంబ సర్వేతో అన్ని వర్గాలకు సమన్యాయం జరుగుతుందని వెల్లడించారు. అభివృద్ధి సంక్షేమం సమంగా అందిస్తూ ముందుకు సాగుతామన్నారు.

Similar News

News March 14, 2025

సిద్దిపేట జిల్లాలో బాలిక ఆత్మహత్య

image

జగదేవ్‌పూర్ మండలం మునిగడప గ్రామంలో కడుపునొప్పి భరించలేక బాలిక ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన నర్ర బాలేశం, నాగలక్ష్మి దంపతుల కుమార్తె ప్రవళిక(13) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. రెండు రోజుల క్రితం బంధువుల ఇంట్లో పెళ్లికి వెళ్లి నిన్న తిరిగొచ్చింది. కడుపునొప్పి వస్తుందని తల్లికి చెప్పి ఇంట్లోకి వెళ్లి ఉరేసుకుంది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

News March 14, 2025

హోలీ పిడిగుద్దులాట.. ఇరు వర్గాల మధ్య ఘర్షణ

image

హోలీ సందర్భంగా శివంపేట మండలం <<15752874>>కొంతాన్‌పల్లి<<>>లో నిర్వహించిన పిడుగుద్దులాటలో ఘర్షణ వాతావరణం నెలకొంది. హోలీని పురస్కరించుకొని ప్రతి ఏటా సంప్రదాయం ప్రకారం పిడితాడు లాగుతూ పిడుగుద్దులాటం ఇక్కడ ఆనవాయితీ. కాగా ఇందులో ఎస్సీ కలకంటి వర్గం పాల్గొంటామని చెప్పడంతో పతందార్లు అభ్యంతరం చెప్పారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో తూప్రాన్ సీఐ ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు మధ్య కార్యక్రమం నిర్వహించారు.

News March 14, 2025

నీటి ఎద్దడిలో రైతులకు సూచనలు.. Way2news స్పెషల్

image

వేసవి సమీపిస్తున్న వేళ రైతులు పంటలకు తడులు వేసే క్రమంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని మెదక్ జిల్లా వ్యవసాయ అధికారి వినయ్ కుమార్ తెలిపారు. ఆయన నర్సాపూర్లో Way2newsతో మాట్లాడుతూ.. జిల్లాలో 2,58,487 ఎకరాలో వరి, 8321 ఎకరాల్లో ఇతర పంటలు సాగు చేస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో నీటి ఎద్దడి నేపథ్యంలో రైతుల నీటిని పొదుపుగా వాడుకొని పంటలు సాగుచేసుకోవాలని సూచించారు.

error: Content is protected !!