News February 13, 2025

దామరగిద్ద: మన్యంకొండ జాతరకు వెళ్తే ఇళ్లు దోచారు !

image

దామరగిద్ద మండలంలోని ఉల్లిగుండం గ్రామానికి చెందిన చాలామంది తమ ఇంటి ఇలవేల్పు మన్యంకొండ జాతర రథోత్సవానికి ఎడ్లబండ్లతో బయలుదేరి వెళ్లారు. ఇదే అదునుగా భావించిన దుండగులు ఆ గ్రామంపై కన్నేశారు. బుధవారం అర్ధరాత్రి పలు ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు. వెంటనే స్థానికులు గమనించి వారిని వెంబడించగా.. వారు తెచ్చుకున్న బైక్ వదిలి పారిపోయినట్లు స్థానికులు వాపోతున్నారు. పోలీసులు చేరుకొని విచారణ చేపట్టారు.

Similar News

News February 13, 2025

కామారెడ్డి: హాస్టల్‌‌లో ఉండటం ఇష్టం లేక పారిపోయిన విద్యార్థి

image

సిరిసిల్ల గంభీరావుపేట మండలం గోరింటాకు చెందిన శివరామకృష్ణ అనే బాలుుడు కామారెడ్డిలోని ఓ ప్రైవేటు పాఠశాలలో హాస్టల్‌లో ఉంటూ 7వ తరగతి చదువుతున్నాడు. గురువారం అతని తల్లి హాస్టల్‌లో వదిలేందుకు తీసుకు వెళ్తుండగా రైల్వే గేటు వరకు వచ్చి పారిపోయినట్లు ఆమె తెలిపింది. మిస్సింగ్ కేసును నమోదు చేసినట్లు కామారెడ్డి పోలీసులు పేర్కొన్నారు.  హాస్టల్‌లో ఉండటం ఇష్టం లేక పారిపోయాడని బాలుని తల్లి చెప్పారు.

News February 13, 2025

వరంగల్: కొత్త రకం మిర్చి ధరల వివరాలు

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో వివిధ రకాల కొత్త రకం మిర్చి ధరలు తరలివచ్చాయి. ఈ క్రమంలో ధరలు వివరాలు చూస్తే.. 5,531 మిర్చి రూ.10,800, దీపిక మిర్చి రూ.16,300, అకిరా బ్యాగడి రూ.11 వేల ధర పలికాయి. అలాగే 2043 రకం మిర్చి రూ.13,500, S10 మిర్చి రూ.11 వేలు ధర వచ్చినట్లు వ్యాపారులు తెలిపారు.

News February 13, 2025

కొత్త రూల్స్.. లేటైతే డబుల్ ఛార్జ్

image

FEB 17 నుంచి కొత్త FASTag రూల్స్ అమల్లోకి రానున్నాయి. FASTagలో తగిన బ్యాలెన్స్ లేకపోవడం, KYC పెండింగ్, ఛాసిస్, వెహికల్ నంబర్లు వేర్వేరుగా ఉంటే FASTag బ్లాక్‌లిస్టులోకి వెళ్తుంది. టోల్ గేటుకు చేరుకునే సమయానికి 60min కంటే ఎక్కువ టైం FASTag ఇన్‌యాక్టివ్, బ్లాక్ లిస్టులో ఉంటే ఎర్రర్ చూపుతుంది. స్కాన్ చేసిన 10 min తర్వాత ఇన్‌యాక్టివ్‌లోకి వెళ్లినా ఆ లావాదేవీ తిరస్కరిస్తారు. అప్పుడు డబుల్ టోల్ కట్టాలి.

error: Content is protected !!