News April 3, 2025
దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ: ఏలూరు కలెక్టర్

ప్రత్యేక అవసరాలు గల పిల్లలు పట్ల ప్రేమా ఆప్యాయతలను పంచాలి అని కలెక్టర్వెట్రి సెల్వి అన్నారు. ఏలూరులో గురువారం ఓ జరిగిన కార్యక్రమంలో 500 మంది పిల్లలకు రూ.75 లక్షల విలువ చేసే వివిధ ఉపకరణాలు ఉచితంగా పంపిణీ చేశారు. జిల్లా పరిషత్తు సమావేశ మందిరంలో జిల్లా విద్యశాఖ, సమగ్రశిక్ష ఏలూరు జిల్లా ఆధ్యర్యంలో వీటిని అందజేశారు.
Similar News
News April 10, 2025
HYD: నేడు HCUకు సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ

కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిని క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు నేడు సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ HYDకు రానుంది. ఈ బృందంలో ఇద్దరు లేదా ముగ్గురు కేంద్ర ప్రభుత్వాధికారులు, న్యాయ పర్యావరణవేత్తలు, ఆయా రంగాలకు చెందిన వారు ఉన్నట్లు సమాచారం. కాగా.. ఈనెల 11వ తేదీలోగా ఆయా అంశాలపై సుప్రీంకోర్టుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం నివేదిక సమర్పించాల్సి ఉంది.
News April 10, 2025
మహబూబ్నగర్ జిల్లాలో 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రతలు

మహబూబ్నగర్ జిల్లాలో గత 24 గంటల్లో ఉష్ణోగ్రతలు పెరిగాయి. మహమ్మదాబాద్ 39.9 డిగ్రీలు, నవాబుపేట 39.7 డిగ్రీలు, కౌకుంట్ల 39.6, చిన్నచింతకుంట 39.5, మిడ్జిల్ (M)కొత్తపల్లి 39.4, చిన్నచింతకుంట (M) వడ్డేమాన్ 39.2, మూసాపేట (M) జానంపేట 39.2, భూత్పూర్ (M) కొత్త మొల్గర 39.1, కోయిలకొండ 38.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ప్రజలు ఎండల తీవ్రతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
News April 10, 2025
సీతానగరం: రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

సీతానగరం మండలంలో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో పండయ్య మృతి చెందారు. మరిపివలసకు చెందిన పండయ్య (65) పాలు పోసి ఇంటికి వస్తుండగా రోడ్డు దాటే సమయంలో బొబ్బిలి నుంచి పార్వతీపురం వైపు వస్తున్న బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్పై ఉన్న వంశీకి తీవ్ర గాయాలయ్యాయి. SI రాజేశ్ ఘటనపై కేసు నమోదు చేశారు.