News February 27, 2025
దుబ్బరాజన్న సన్నిధికి పోటెత్తిన భక్తులు

సారంగాపూర్ మండలంలోని పెంబట్ల-కోనాపూర్ గ్రామంలో కొలువైన శ్రీదుబ్బరాజేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వేకువజాము నుంచి భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. స్వామివారికి అత్యంత ప్రీతికరమైన కోడెమొక్కులు, కుంపటి గజాశూలం మొక్కులు తీర్చుకుంటున్నారు. జాతరలో భక్తులకు సరైన సౌకర్యాలు లేవని పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Similar News
News December 22, 2025
నర్వ ఆస్పిరేషన్ బ్లాక్పై సెంట్రల్ ప్రభారీ అధికారి సమీక్ష

నర్వ మండల ఆస్పిరేషన్ బ్లాక్ ప్రాజెక్ట్ ప్రగతిపై సోమవారం సాయంత్రం నారాయణపేట కలెక్టరేట్లో ఇన్ఛార్జ్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్తో కలిసి సెంట్రల్ ప్రభారి అధికారిణి స్వప్న దేవి రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పోషకాహారం, విద్యా, వ్యవసాయం, ప్రాథమిక మౌలిక సదుపాయాలు, సామాజిక అభివృద్ధి సూచీలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులను అడిగి తెలుసుకున్నారు. సమీక్షలో అధికారులు పాల్గొన్నారు.
News December 22, 2025
ఇంటి వెనుక ఖాళీ స్థలం వదిలితేనే ఆరోగ్యం

ఇంటి వెనుక ఖాళీ స్థలాన్ని కచ్చితంగా వదలాలని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. తద్వారా గాలి ప్రసరణతో ఇంట్లో ఉక్కపోత, తేమ తగ్గుతాయని అంటున్నారు. ‘సహజ వెలుతురు వల్ల సానుకూల శక్తి ప్రసరిస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. వాస్తు రీత్యా ఇంటి వెనుక భాగం ఖాళీ ఉంటే కుటుంబంలో ప్రశాంతత, ఆర్థికాభివృద్ధి ఉంటాయి. స్థలం తక్కువని నిర్లక్ష్యం చేయకుండా కొంత వరకైనా ఇంటి వెనకాల స్థలం వదిలాలి’ అంటున్నారు. <<-se>>#Vasthu<<>>
News December 22, 2025
NRPT: ‘ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి’

ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అన్నారు. సోమవారం హైదరాబాద్ నుంచి జిల్లాల కలెక్టర్లు, అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో నారాయణపేట ఇన్ఛార్జ్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్ పాల్గొన్నారు. ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను బీఎల్ఓల వారీగా సమీక్ష నిర్వహించి పురోగతి లేని బీఎల్ఓపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు.


