News December 31, 2024

దుబ్బాక: ప్రమాదవశాత్తూ బావిలో పడి వ్యక్తి మృతి

image

ప్రమాదవశాత్తు బావిలో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన దుబ్బాక మండలం రామక్కపేట గ్రామంలో చోటుచేసుకుంది.. దుబ్బాక ఎస్‌ఐ గంగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. రామక్కపేటకి చెందిన అనుముల లింగం (48) అనే వ్యక్తి ఆదివారం తన వ్యవసాయ పొలం వద్ద వ్యవసాయ పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు కాలుజారి బావిలో పడి మృతి చెందాడు.

Similar News

News February 5, 2025

ఆర్టీసీ బస్సులను వినియోగించుకోండి: డీఎం సురేఖ

image

వివాహ శుభకార్యాలు, పుణ్యక్షేత్రాలు, తీర్థయాత్రలకు, ఆర్టీసీ బస్సులను వినియోగించుకోవాలని మెదక్ డీఎం సురేఖ కోరారు. 200 కిలోమీటర్లకు పల్లెవెలుగు బస్సుకు రూ.13,200, ఎక్స్ ప్రెస్ బస్సుకు రూ.14,700 ఉంటుందన్నారు. ఈ రేట్లు 12 గంటల సమయం పాటు వర్తిస్తాయని, ఆర్టీసీ బస్సులను వినియోగించుకోవాలని ఆమె కోరారు.

News February 5, 2025

మెదక్: రాష్ట్రస్థాయిలో ద్వితీయ స్థానం జిల్లా క్రీడాకారులు

image

మెదక్ జిల్లాకు చెందిన రగ్బీ క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. మంచిర్యాల జిల్లాలో మూడు రోజులపాటు నిర్వహించిన రాష్ట్రస్థాయి అండర్‌17 సెమీ కాంటాక్ట్ రబీ పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయిలో రెండవ స్థానంలో నిలిచారు. వెండి పతకం సాధించిన రగ్బీ క్రీడాకారులను మెదక్ జిల్లా రగ్బీ అసోసియేషన్ అధ్యక్షుడు కర్ణం గణేశ్ రవికుమార్ అభినందించారు.

News February 5, 2025

మెదక్: 30 ఏళ్ల కల సాకారం: మంత్రి దామోదర్

image

30, 40 ఏళ్ల కల నేడు సాకారం అయ్యిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. 30 ఏళ్ల ఉద్యమానికి నేడు పరిష్కారం దొరికిందని మంత్రి తెలిపారు. ఎస్సీ వర్గీకరణ వల్ల ఎవరి ప్రయోజనాలకు ఇబ్బంది ఉండదన్నారు. వర్గీకరణ వల్ల కొందరిలో భయం, అభద్రతాభావం కలుగుతోందని, వర్గీకరణ ఏ వర్గానికి వ్యతిరేకం కాదన్నారు.

error: Content is protected !!