News March 13, 2025
దేవరకద్ర: చికిత్స పొందుతూ మహిళ మృతి

దేవరకద్ర నియోజకవర్గం కౌకుంట్ల మండలానికి చెందిన నీలి నాగన్న కూతురు దండు మంగమ్మ మంగళవారం కూలీ పనులకు వెళుతుండగా కారు ఢీ కొనగా రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలైన విషయం తెలిసిందే. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. మృతురాలికి ఒక కుమారుడు ఉన్నాడు. దీంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Similar News
News March 14, 2025
MBNR: విపత్తుల నివారణకు 300 మంది వాలంటీర్లు: జిల్లా కలెక్టర్

సహజ మానవ కల్పిత విపత్తులను నివారించేందుకు 300 మంది వాలంటీర్లను నియమించినట్లు జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి తెలిపారు. గురువారం ఆపదమిత్ర వాలంటీర్ల శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ప్రకృతి మానవ కల్పిత విపత్తులు జరిగినప్పుడు అధికారులు ఘటనా స్థలానికి చేరుకునే లోగా పౌరులే స్వయంరక్షణ పద్ధతులను పాటిస్తూ ఇతరుల ప్రాణాలను, ఆస్తి నష్టాలు కాకుండా ఏ విధంగా నివారించాలో తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
News March 14, 2025
ఉమ్మడి జిల్లాలో నేటి..TOP NEWS!!

✔ఘనంగా ‘ల్యాబ్ టెక్నీషియన్ డే’
✔రేపే హోలీ..ఊపందుకున్న రంగుల కొనుగోళ్ళు
✔ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా కవయిత్రి మొల్ల జయంతి
✔వనపర్తి: కీచక ఉపాధ్యాయులపై సస్పెన్షన్
✔GWL:విద్యారంగానికి నిధులు కేటాయించాలి:BRSV
✔ప్రశాంత వాతావరణంలో హోలీ పండుగ జరుపుకోవాలి:ఎస్పీలు
✔ఉమ్మడి జిల్లాలో దంచికొడుతున్న ఎండలు
✔SLBC దుర్వాసన వస్తున్నా… అంతు చిక్కడం లేదు
✔పలుచోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్
News March 13, 2025
MBNR: ప్రతి దరఖాస్తు పరిష్కరించుకునేలా చూడాలి: కలెక్టర్

ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరణ కోసం 31,190మంది దరఖాస్తు చేసుకోగా ప్రతి ఒక్కరు పరిష్కరించుకునేలా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి ఆర్పిలకు సూచించారు. గురువారం మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ సెంటరును ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రతి దరఖాస్తుదారుడికి ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చి ఈ నెలాఖరు లోగా పరిష్కరించుకుంటే 25% రాయితీ ప్రభుత్వం ఇస్తున్న విషయాన్ని వారికి వివరించాలన్నారు.