News March 23, 2025

ద్వారకాతిరుమల: కిడ్నాపర్‌కు సహకరించిన వ్యక్తి అరెస్ట్

image

ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన ద్వారకాతిరుమల మండలానికి చెందిన బాలికను తెలంగాణ రాష్ట్రానికి చెందిన యువకుడు 3 నెలల క్రితం కిడ్నాప్ చేశాడు. బాలిక తండ్రి ఫిర్యాదుతో అప్పట్లో పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు ఆ యువకుడితోపాటు మరో ఇద్దరిని వెంటనే అరెస్ట్ చేశారు. నిందితుడికి సహకరించిన తెలంగాణ రాష్ట్రం, కలిగోట్‌కు చెందిన సురేశ్‌ను శనివారం అరెస్ట్ చేశారు.

Similar News

News March 26, 2025

ఈ మార్పులు కనిపిస్తే కళ్లజోడు మార్చాల్సిందే!

image

ఒకటే కళ్లజోడును ఎక్కువ రోజులు వాడొద్దని, ఏడాది లేదా రెండేళ్లకోసారి పరీక్ష చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈ సంకేతాలేమైనా కనిపిస్తే కళ్లద్దాలను మార్చుకోవాలని చెబుతున్నారు.
1. డ్రైవింగ్‌లో సిగ్నల్స్ కనిపించకపోవడం, దగ్గరకు వెళ్లేవరకూ చదవలేకపోవడం 2. పుస్తకాలు చదవడం, మొబైల్‌ చూడటం కష్టంగా అనిపించడం 3. ఒకటి లేదా రెండు కళ్లల్లోని దృష్టిలో మార్పు కనబడటం వంటివి కనిపించినప్పుడు అద్దాలు మార్చాలి.

News March 26, 2025

నేత్రపర్వంగా భద్రాద్రి రామయ్య నిత్యకళ్యాణం

image

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి నిత్యకళ్యాణ వేడుక బుధవారం నేత్రపర్వంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితరపూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మ వారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకళ్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.

News March 26, 2025

ప్రజల కోసమే భూభారతి: పొంగులేటి

image

TG: ధరణి ఓ దుర్మార్గ చట్టమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. అందుకే భూభారతి చట్టం తీసుకొచ్చామని ఆయన అసెంబ్లీలో చెప్పారు. ‘ధరణి ఎజెండాతోనే మేం ఎన్నికలకు వెళ్లాం. ధరణి బాగుందా లేదా అని ఎన్నికల్లో ప్రజల తీర్పుతోనే స్పష్టమైంది. బీఆర్ఎస్ తప్పు చేసింది కాబట్టే ఓడించారు. భవిష్యత్‌లోనూ భూభారతిపైనే ఎన్నికలకు వెళ్తాం. ఆ ఎన్నికల్లో ప్రజలు ఎవరికి మద్దతిస్తారో చూద్దాం’ అంటూ సవాల్ విసిరారు.

error: Content is protected !!