News February 28, 2025
ద్వారకాతిరుమల: నిమ్మకాయలు అమ్మిన సినీ నటుడు షఫీ

ప్రముఖ క్షేత్రం ద్వారకాతిరుమలలో సినీ నటుడు షఫీ నిమ్మకాయలు అమ్మి సందడి చేశారు. నిన్న ఆయన మరో నటుడు మాణిక్ రెడ్డితో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుగు ప్రయాణంలో లింగయ్య చెరువు వద్ద నిమ్మకాయలు అమ్మే మహిళా వ్యాపారులు ఆయన కారును ఆపి, వాటిని కొనాలని కోరారు. వెంటనే కారు దిగిన షఫీ తాను నిమ్మకాయలు అమ్ముతాను అంటూ, వారితో కలిసి సందడి చేశారు.
Similar News
News February 28, 2025
పేద ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్: శ్రీనివాస వర్మ

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పేద ప్రజలకు ఆకాంక్షలకు అనుగుణంగా ఉందని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమం కోసం రూ.3.2 లక్షల కోట్ల నిధులు కేటాయించడం హర్షణీయమన్నారు. తెలుగు భాష అభివృద్ధికి రూ.10కోట్లు కేటాయించడంతో పాటు సూపర్ సిక్స్ పథకాల అమలకు నిధులు కేటాయించడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
News February 28, 2025
పశ్చిమ గోదావరి: పశు పోషకులకు గుడ్ న్యూస్

జిల్లాలోని పశువుల రైతులు పశు వ్యాధి నియంత్రణ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ నాగరాణి తెలిపారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్లో జాతీయ పశువ్యాధి నియంత్రణ పథకం గోడ పత్రికను ఆమె ఆవిష్కరించారు. మార్చి 1 నుంచి మార్చి 30 వరకు జాతీయ పశు వ్యాధి నియంత్రణ పథకంలో భాగంగా పశువులకు గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు, పలు వ్యాధి నిరోధక టీకాలను ఉచితంగా వేయనున్నట్లు తెలిపారు.
News February 28, 2025
ప.గో వ్యాప్తంగా 65.43% ఓటింగ్ నమోదు

ఉభయ గోదావరి జిల్లాలో పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఓటింగ్ ప్రక్రియ ముగిసిన సమయానికి 65.43 శాతం ఓటింగ్ నమోదైనట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. జిల్లాలోని అన్ని మండలాల్లో అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని అని తెలిపారు.