News April 16, 2025
ధరూర్: ‘ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలి’

ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేయాలని గద్వాల కలెక్టర్ సంతోష్ పేర్కొన్నారు. బుధవారం కేటీదొడ్డి మండలం ముత్యాల, ధరూర్ ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇంటి నిర్మాణ నమూనాను పరిశీలించారు. ఇంటి నిర్మాణానికి వినియోగిస్తున్న మెటీరియల్, క్వాలిటీ గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆయా గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితాను పరిశీలించారు.
Similar News
News April 17, 2025
నేటి నుంచి ‘భూభారతి’ రెవెన్యూ సదస్సులు

TG: ‘భూభారతి’ పైలెట్ ప్రాజెక్ట్కు ఎంపిక చేసిన 4 మండలాల్లో నేటి నుంచి రెవెన్యూ సదస్సులు జరగనున్నాయి. అక్కడ రైతులకు ఎలాంటి సమస్యలు ఉన్నా అధికారులు దరఖాస్తులు స్వీకరించి, వాటిని పోర్టల్ ద్వారా పరిష్కరిస్తారు. అందులో పరిష్కారం కాకున్నా, పోర్టల్ పని చేయకపోయినా రాష్ట్రస్థాయిలో వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటారు. ఈ సదస్సులను మంత్రి పొంగులేటి ఇవాళ నారాయణపేట జిల్లా మద్దూరులో ప్రారంభించనున్నారు.
News April 17, 2025
ఆస్తికోసం తమ్ముడిపై అన్న కత్తితో దాడి

ఆస్తిలో వాటా అడిగిన తమ్ముడి కళ్లలో కారం చల్లి అన్న కత్తితో దాడికి పాల్పడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. పెద్దమండ్యం మండలానికి చెందిన సుధాకర్ రెడ్డికి తన అన్న వెంకటరమణారెడ్డికి మధ్య ఆస్తి వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం సుధాకర్ రెడ్డి అన్నను ఆస్తిలో వాటా పంచాలని పొలం దగ్గర నిలదీశాడు. దీంతో ఆగ్రహించిన వెంకటరమణారెడ్డి తమ్ముడి కళ్లలో కారం చల్లి కత్తి దాడిచేశాడు.
News April 17, 2025
శంఖవరం: చెప్పులు దండ వేసిన నిందితుడు అరెస్ట్

శంఖవరంలో అంబేడ్కర్ విగ్రహానికి అపచారం చేసిన వ్యక్తిని ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం కోర్టులో హాజరు పరుస్తామని పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు తెలిపారు.నిందితుడి పేరు పడాల వాసు(20) అని అతను ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నాడని డీఎస్పీ వెల్లడించారు. డీఎస్పీ ఆధ్వర్యంలో నలుగురు సీఐలు,10మంది ఎస్సైలు ,40 మంది సిబ్బంది సాంకేతికతతో అతన్ని పట్టుకున్నామని ఎస్పీ వారిని అభినందించారు.