News April 4, 2025
ధరూర్ నూతన పోలీస్ స్టేషన్కు డీజీపీ భూమి పూజ

ధరూర్ మండల కేంద్రంలో రూ.2.65 కోట్ల వ్యయంతో నిర్మాణం చేపట్టే నూతన పోలీస్ స్టేషన్కు తెలంగాణ డీజీపీ జితేందర్ ఈరోజు శంకుస్థాపన చేశారు. ధరూర్ మండలానికి ఇప్పటికే జూరాల దగ్గర పోలీస్ స్టేషన్ ఉన్నప్పటికీ నూతన పోలీస్ స్టేషన్ నిర్మాణానికి ఈరోజు భూమి పూజ చేశారు. ఆయన వెంట గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ఎస్పీ శ్రీనివాస్, డీఎస్పీ తదితరులు పాల్గొన్నారు.
Similar News
News April 18, 2025
NZB: పోలీస్ స్టేషన్లను తనిఖీ చేసిన సీపీ

నగరంలోని పలు పోలీస్ స్టేషన్లను సీపీ సాయి చైతన్య శుక్రవారం తనిఖీ చేశారు. 3, 4, రూరల్ పోలీస్ స్టేషన్లను పరిశీలించారు. రిసెప్షన్ సెంటర్, కంప్యూటర్ సిబ్బంది పనితీరును అడిగి తెలుసుకున్నారు. 5S విధానం అమలు చేస్తున్నారు లేదా అని ఆరా తీశారు. వాహనాల పార్కింగ్ స్థలాన్ని చూశారు. గంజాయి, సైబర్ నేరాల నిర్మూలనకు కృషి చేయాలని పోలీసు సిబ్బందికి సూచించారు.
News April 18, 2025
విశాఖలో దేవిశ్రీప్రసాద్ మ్యూజికల్ నైట్.. పోలీసుల సూచనలు

విశాఖ పోర్ట్ స్టేడియంలో శనివారం నిర్వహించే దేవిశ్రీప్రసాద్ మ్యూజికల్ నైట్కు వచ్చే వారికి పోలీసులు శుక్రవారం పలు సూచనలు చేశారు. వీఐపీ టికెట్లు ఉన్నవారికి మాత్రమే ప్రధాన గేటు ద్వారా ఎంట్రీ ఉంటుందన్నారు. వారి వాహనాలకు లోపల పార్కింగ్ చేసుకోవాలన్నారు. సాధారణ టికెట్లు ఉన్నవారికి పోర్ట్ స్టేడియం వెనుక గేటు నుంచి ప్రవేశం ఉంటుందన్నారు. వారి వాహనాలు నిర్దేశించిన ప్రదేశంలో పార్కింగ్ చేయాలన్నారు.
News April 18, 2025
GHMC పరిధిలో నమోదైన వర్షపాతం..!

HYDలో భారీ వర్షం కురుస్తుంది. అత్యధికంగా రెయిన్బజార్ యాకుత్పురాలో 56.5 మి.మీ, డబీర్పుర బలశెట్టి వాటర్ ట్యాంక్ వద్ద 48.5 మిమీ, దూద్బౌలి 46.5 మిమీ వర్షం నమోదైంది. గన్ఫౌండరీ, రూపాల్ బజార్ 2 చోట్లా 41 మిమీ, నాంపల్లిలో 40.5 మిమీ, అజంపురాలో 38.5 మిమీ, కంచన్బాగ్లో 36.8 మిమీ, ఎడిబజార్లో 33.3 మిమీ, కుత్బుల్లాపూర్ ఆదర్శ్నగర్లో 31.5 మిమీ వర్షపాతం కురిసింది.