News April 8, 2025

ధర్మపురి: గోదావరిలో దూకి వ్యక్తి ఆత్మహత్య

image

ధర్మపురి మండలంలోని రాయపట్నం గోదావరిలో దూకి హషాం అహ్మద్ (45) అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై ఉదయ్ కుమార్ తెలిపారు. మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణానికి చెందిన అహ్మద్ గత కొంతకాలం నుంచి ఫైనాన్స్ విషయంపై బాధపడుతున్నాడన్నారు. ఉదయం రాయపట్నం గోదావరిలో మృతదేహం కనిపించగా తన తండ్రి మహమ్మద్ అలీ అహ్మద్ ఆచూకీ తెలిపామని ఆయన వివరించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని JGTL ఏరియా ఆసుపత్రికి తరలించారు.

Similar News

News April 17, 2025

సంగారెడ్డి: వైర్ల దొంగల ముఠా అరెస్ట్

image

నూతన వెంచర్లలో అల్యూమినియం వైర్ల దొంగల ముఠాను అరెస్టు చేసినట్లు సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. ఎస్పీ కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సదాశివపేట సీసీఎస్ పోలీసుల సంయుక్త ఆపరేషన్‌లో వైర్ల దొంగలను పట్టుకున్నారు. 9 మందిని అరెస్టు చేయగా.. వారి నుంచి రూ. 2.02 లక్షల విలువైన 778 కిలోల అల్యూమినియం ఎలక్ట్రికల్ వైర్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు.

News April 17, 2025

MNCL: ఉద్యోగాలు.. APPLY NOW

image

అగ్నివీర్ ఆర్మీ రిక్రూట్మెంట్ ఆన్‌లైన్ దరఖాస్తు నమోదుకు ఈనెల 25వ వరకు గడువు పొడిగించినట్లు అధికారులు తెలిపారు. ఆర్మీ రిక్రూట్మెంట్ 2025-28 సంవత్సరానికి అగ్నిపథ్ పథకం కింద అగ్నివీర్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ గడువును పొడిగించారన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు www.joinindianarmy.ac.in వెబ్‌సైట్‌లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

News April 17, 2025

జనగామ: స్కానింగ్, డయాగ్నొస్టిక్ సెంటర్లలో అధికారుల తనిఖీ

image

జనగామలో స్కానింగ్, డయాగ్నొస్టిక్ సెంటర్లపై జిల్లా వైద్యాధికారి డా.మల్లిఖార్జున్ రావు, ఆరోగ్యశాఖ అధికారులు తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా న్యూ విజయ స్కానింగ్ సెంటర్‌ను మూడు రోజులు మూసివేసి, రూ.50 వేలకు పైగా జరిమానా విధించినట్లు చెప్పారు. అనుమతి లేని సిటీ ఐ కేర్ & సాయి స్కానింగ్ సెంటర్లను మూసివేశారు. నిబంధనలకు విరుద్ధంగా హాస్పిటల్ యాజమాన్యాలు వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

error: Content is protected !!