News July 31, 2024
ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు
సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి బుధవారం రూ.64,587 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.34,538, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.20,725, అన్నదానం రూ.9,324 వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలిపారు.
Similar News
News October 8, 2024
KNR: సంతలో మహిళపై పండ్ల వ్యాపారి చెప్పుతో దాడి
కరీంనగర్ జిల్లా కేశవపట్నం వారసంతలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. సోమవారం సంతలో పండ్లు అమ్ముకునే వ్యక్తి పక్కనే పూలు అమ్ముకునే మహిళపై అసభ్యంగా తిడుతూ చెప్పుతో దాడి చేశాడు. అక్కడికి చేరుకున్న పోలీసులు గొడవ సద్దుమణిగేలా చేసి మహిళను అక్కడినుంచి పంపించారు. అయితే కొట్టిన వ్యక్తిని వదిలిపెట్టి దెబ్బలు తిన్న మహిళనే అక్కడినుంచి పంపేయడంతో పోలీసులు ఆ వ్యక్తికే వత్తాసు పలకడం పట్ల స్థానికులు విమర్శిస్తున్నారు.
News October 8, 2024
కరీంనగర్: నేడే ‘సద్దుల బతుకమ్మ’
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సాధారణంగా తొమ్మది రోజులకు సద్దుల బతుకమ్మ నిర్వహిస్తారు. కానీ, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని వేములవాడ సహా.. పలు ప్రాంతాల్లో మాత్రం ఏడు రోజులకే సద్దుల బతుకమ్మ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా ఇక్కడి ఇంటి బిడ్డలు, కోడళ్లు.. 7, 9 రోజులకు రెండు సార్లూ సద్దుల బతుకమ్మలో పాల్గొంటారు. మరి మీ ప్రాంతంలో సద్దుల బతుకమ్మ ఎప్పుడో కామెంట్ చేయండి.
News October 8, 2024
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్
@ శంకరపట్నం మండలంలో ఎస్సారెస్పీ కాలువలో పడి రైతు మృతి.
@ బెజ్జంకి మండలంలో మద్యం మత్తులో యువకుడి ఆత్మహత్య.
@ సిరిసిల్ల ప్రజావాణిలో 82 ఫిర్యాదులు.
@ జగిత్యాల ప్రజావాణిలో 25 ఫిర్యాదులు.
@ హుజురాబాద్లో అక్రమ రేషన్ బియ్యం పట్టివేత.
@ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వైభవంగా కూడా సాగుతున్న దుర్గ నవరాత్రి ఉత్సవాలు, బతుకమ్మ సంబరాలు.
@ మెట్పల్లి పట్టణంలో తప్పిపోయిన బాలుడి అప్పగింత.