News September 4, 2024
ధవళేశ్వరం: సముద్రంలోకి 2,99,854 క్యూసెక్కుల జలాలు
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రాజమండ్రి రూరల్ మండల పరిధిలోని ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద గోదావరి ఉద్ధృతి పెరుగుతోంది. మంగళవారం సాయంత్రానికి బ్యారేజీ నుంచి 2,99,854 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేశారు. ప్రస్తుతం ప్రాజెక్టు వద్ద నీటిమట్టం 6.20 అడుగులకు చేరింది. ఖరీఫ్ సాగుకు సంబంధించి డెల్టా కాలువలకు 3 వేల క్యూసెక్కుల నీటిని వదిలారు.
Similar News
News September 18, 2024
తూ.గో.: చిరుత కోసం అదనపు బోన్లు ఏర్పాటు
సీసీ కెమెరాలు, ట్రాప్ కెమెరాలలో బుధవారం చిరుత కదలికలు గుర్తించలేదని అటవీ శాఖ అధికారి భరణి తెలిపారు. ట్రాప్ కెమెరాలను మారుస్తూ అదనపు ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. చిరుత కోసం ఏర్పాటు చేసిన బోనులలో కుక్కలు చిక్కుకుంటున్నాయని, దాని వల్ల ఇబ్బంది కలుగుతుందన్నారు. నివాస ప్రాంతాల్లో చిరుత సంచరిస్తున్నట్లు నిర్ధారణ కాలేదని, దివాన్ చెరువు అటవీ ప్రాంతంలోనే చిరుత ఉందన్నారు.
News September 18, 2024
అన్నవరం ఆలయంలో ముగ్గురిపై కేసు
అన్నవరం దేవస్థానానికి చెందిన ముగ్గురు ఉద్యోగులపై కేసు నమోదైనట్లు ఎస్సై కృష్ణమాచారి మంగళవారం తెలిపారు. తుని మండలం తేటగుంటలో ఈనెల 15న పేకాడుతున్న పలువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారిలో ఆలయానికి చెందిన కె.కొండలరావు, ఐ.వి.రామారావు, జె.శ్రీనివాస్ లు ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు.
News September 18, 2024
గంగవరం: విద్యార్థినులతో HM అసభ్య ప్రవర్తన.. సస్పెండ్
గంగవరంలోని స్థానిక గిరిజన సంక్షేమ శాఖ బాలికల ఆశ్రమ పాఠశాలలో HM విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ మేరకు HM. రామకృష్ణను మంగళవారం విధుల నుంచి సస్పెండ్ చేసినట్లు రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి కట్టా సింహాచలం తెలిపారు. రామకృష్ణపై రహస్యంగా, సమగ్ర విచారణ చేపట్టి ఈ నిర్ణయం తీసుకొన్నామన్నారు.