News February 1, 2025

నందికొట్కూరులో రాష్ట్రపతి అవార్డు గ్రహీత మృతి

image

నందికొట్కూరుకు చెందిన రిటైర్డ్ టీచర్, రాష్ట్రపతి అవార్డు గ్రహీత ఇందిరాబాయి (90) శనివారం ఉదయం మరణించారు. కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ ఉదయం తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె మృతిపై స్థానిక ఉపాధ్యాయులు, విద్యార్థులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 1993లో ఆమె ఉత్తమ ఉపాధ్యాయులిగా రాష్ట్రపతి అవార్డును అందుకున్నారు.

Similar News

News March 6, 2025

హమాస్‌తో అమెరికా రహస్య చర్చలు?

image

ఉగ్రవాద సంస్థ హమాస్‌తో అమెరికా రహస్య చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. గాజాలో బందీలుగా ఉన్న అమెరికన్లను విడిపించడం కోసం, ఇజ్రాయెల్‌తో యుద్ధం ముగించడం కోసం ఈ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అమెరికన్ ప్రెసిడెన్షియల్ దౌత్యవేత్త ఆడమ్ బోహ్లెర్ నాయకత్వంలో దోహాలో ఈ చర్చలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా హమాస్‌ను 1997లో అమెరికా ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది.

News March 6, 2025

ములుగు: మావోయిస్టు కొరియర్ల వివివరాలు

image

వెంకటాపురం మండలం కొత్తపల్లి క్రాస్ వద్ద నలుగురు మావోయిస్టు కొరియర్లను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బాడిసే అనిల్, కుర్హమి భామన్, మాడవి సుక్కు, సోడి ఇడుమల@చారి వీరంతా ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాకు చెందినవారన్నారు. మావోయిస్టు పార్టీకి దుస్తులు, ఎలక్ట్రానిక్ వస్తువులు, బూట్లు అందజేస్తున్నట్లు విచారణలో వెల్లడైందన్నారు.

News March 6, 2025

నిర్మల్: ఉర్దూ ఉత్తమ ఉపాధ్యాయ దరఖాస్తుల ఆహ్వానం

image

జిల్లాలోని ఉర్దూ ఉపాధ్యాయులు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు దరఖాస్తు చేసుకోవాలని డీఈవో రామారావు సూచించారు. దరఖాస్తులను ఈ నెల 7న సాయంత్రం 5 గంటలలోపు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో సమర్పించాలన్నారు. జిల్లాలోని ఉర్దూ మాధ్యమ ఉపాధ్యాయులు ఈ విషయాన్ని గమనించి దరఖాస్తులను రెండు రకాల డిక్లరేషన్లతో కలిపి కార్యాలయంలో అందించాలన్నారు.

error: Content is protected !!