News March 21, 2025
నందిగాం: జీడి చెట్టుకి ఉరేసుకుని వ్యక్తి మృతి

నందిగామ మండలం హరిదాసు పురం గ్రామానికి చెందిన అక్కురాడ డిల్లేశ్వరరావు శుక్రవారం జీడి తోటలో ఉరేసుకుని చనిపోయాడు . జీడి పిక్కలు కోయడానికి వెళ్లిన తన తమ్ముడు చూసి, పోలీసులకు సమాచారం తెలిపాడు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీంతో దర్యాప్తు చేస్తున్నారు. మృతునికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు . దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News March 22, 2025
శ్రీకాకుళం: జాబ్ మేళా.. యువతకు ఉద్యోగాలు

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లాలో మినీ జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ మేళా బలగ హాస్పిటల్ జంక్షన్లో ఉన్న పారిశ్రామిక శిక్షణ కేంద్రం (డీఎల్డీసీ-ఐటీఐ)లో ఈనెల 24 వ తేదీన జరగనుందని డీఎల్డీసీ అసిస్టెంట్ డైరెక్టర్ వై.రామ్మోహనరావు పేర్కొన్నారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, తదితర అర్హత కలిగిన యువకులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.
News March 22, 2025
సంతబొమ్మాళి యువకుడికి రూ.1.3 కోట్ల కొలువు

సంతబొమ్మాళి మండలం ఉద్దండపాలెంకు చెందిన హనుమంతు సింహాచలంకు పోలాండ్ దేశంలో రూ.1.3 కోట్ల వార్షిక వేతనంతో ఉద్యోగం లభించింది. విశాఖలో MHRM విద్య పూర్తిచేసిన యువకుడు పోలాండ్లో ఒక డైరీ సంస్థలో HR Assistant గా ఎంపికయ్యారు. ఈ మేరకు యువకుడిని గ్రామస్థులు, స్నేహితులు, బంధువులు అభినందించారు. యువకుడు తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తుంటారు.
News March 22, 2025
ఎమ్మెల్సీ దువ్వాడకు డాక్టరేట్

వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడకు “DAYSPRING INTERNATIONAL UNIVERSITY” డాక్టరేట్ను ప్రధానం చేసింది. ఈ మేరకు తాజాగా శుక్రవారం హైదరాబాద్ యూనివర్సిటీలో తీసుకున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సలహాదారుడు మార్క్ బర్న్, ఇతర ప్రముఖుల చేతుల మీదుగా శ్రీనివాస్ డాక్టరేట్ పట్టాను అందుకున్నారు. ఆయనను పలువురు అభినందించారు.