News March 15, 2025

నంద్యాల: అధిక ధరలకు స్టాంపుల విక్రయాలు

image

నంద్యాలలో అధిక ధరలకు స్టాంపుల విక్రయాలు జరుగుతున్నాయని వినియోగదారులు వాపోతున్నారు. రూ.100 స్టాంప్ రూ.300 విక్రయాలు చేస్తూ అందినకాడికి దోచుకుంటున్నారని తెలిపారు. ఇందులో కామన్ సర్వీస్ స్టాంప్ సెంటర్లు, స్టాంప్ వెండర్లు కీలక పాత్ర వహిస్తున్నారు. ఒక రింగుగా మారి అందరూ ఒకటే ధరలకు విక్రయాలు చేస్తున్నారని, ఈ విషయం అధికారులకు తెలిసినా చర్యలు మాత్రం శూన్యమని వినియోగదారులు తెలిపారు.

Similar News

News March 15, 2025

HYD: పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతలు

image

HYDలో పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. శుక్రవారం పగటి ఉష్ణోగ్రత 38.4 డిగ్రీలుగా నమోదైంది. రాత్రి ఉష్ణోగ్రత 23.6 డిగ్రీల వరకు నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉష్ణోగ్రతలు పెరిగినా గాలులు వీస్తుండడంతో ఉక్కపోత ఇంకా మొదలు కాలేదు. రానున్న రోజుల్లో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల వరకు చేరే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.

News March 15, 2025

VKB: హత్య కేసును ఛేదించిన పోలీసులు

image

షాబాద్‌లోని శ్రీదుర్గా వైన్స్‌లో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. పోలీసుల వివరాలు.. వికారాబాద్ జిల్లాకు చెందిన నరేందర్ సీతారాంపూర్‌లో ఉంటున్నాడు. వైన్స్ ప్రహరీ దూకి చోరీకి యత్నించాడు. శబ్దం రావడంతో అక్కడే నిద్రిస్తున్న బిక్షపతి బయటకు వచ్చాడు. దొరికిపోతానని భయపడి రాడ్డుతో భిక్షపతి తలపై మోదగా అతను మృతి చెందాడు. ఈ కేసును 24 గంటల్లో ఛేదించిన పోలీసులు నరేందర్‌ను రిమాండ్‌కు తరలించారు.

News March 15, 2025

గ్రూప్-3లో ఫస్ట్ ర్యాంక్ ఎవరికంటే?

image

TG: నిన్న వెలువడిన గ్రూప్-3 ఫలితాల్లో మెదక్ జిల్లా పాపన్నపేటకు చెందిన అర్జున్ 339.239 మార్కులతో ఫస్ట్ ర్యాంక్ సాధించారు. ఈయన గ్రూప్-2లో స్టేట్ 18వ ర్యాంక్ సాధించడం గమనార్హం. మొత్తం 2,67,921 మంది పరీక్షలు రాయగా 2,49,557 మందికి జనరల్ ర్యాంకింగ్ లిస్టులను రిలీజ్ చేశారు. టాప్-10లో ఒక్కరు మాత్రమే అమ్మాయి ఉండటం గమనార్హం. మొత్తంగా టాప్-100లో 12 మంది అమ్మాయిలు ఉన్నారు.

error: Content is protected !!