News May 15, 2024
నంద్యాల: ఎంసెట్ అభ్యర్థులకు ముఖ్య గమనిక
ఈనెల 17 నుంచి ఏపీ ఎంసెట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇటీవలే హాల్ టికెట్లు కూడా విడుదల చేశారు. పలువురు అభ్యర్థులకు నంద్యాల జిల్లాలోని ఆర్జీఎం, శాంతిరాం కళాశాలల్లో పరీక్ష కేంద్రాలు కేటాయించారు. అయితే ఈ కళాశాలల్లో ఈవీఎంలను భద్రపర్చడంతో ఆ 2 కళాశాలలను పరీక్షా కేంద్రాల జాబితా నుంచి తొలగించారు. డౌన్లోడ్ చేసుకున్న హాల్ టికెట్లలో ఈ కేంద్రాలు ఉంటే మళ్లీ కొత్తగా డౌన్లోడ్ చేసుకోవాలని అధికారులు తెలిపారు.
Similar News
News October 1, 2024
కర్నూలు: సీఎం చంద్రబాబు వరాల జల్లు
పత్తికొండ మం. పుచ్చకాయలమడకు CM చంద్రబాబు వరాలు కురిపించారు. 203 మందికి ఇళ్ల మంజూరు, 48 మందికి కొత్త పెన్షన్లు, 15 రేషన్ కార్డులు, ఐదుగురికి NREGC జాబ్ కార్డులు, 3 రేషన్ కార్డులు మంజూరు. 135 ఇళ్లకు ట్యాప్, ఒక ఇంటికి కరెంటు కనెక్షన్, 105 ఇళ్లకు మరుగుదొడ్లు, 1.7 KM డ్రైనేజీ కాలువ, 10.7 KM CC రోడ్డు, 22 మినీ గోకుళాలు.. వీటన్నింటికీ రూ.2.83 కోట్లు మంజూరు. మద్దికెర, పత్తికొండ, హోసూరుకు రోడ్లనిర్మాణం.
News October 1, 2024
పుచ్చకాయలమడ గ్రామానికి 203 ఇళ్లు: సీఎం చంద్రబాబు
పుచ్చకాయలమడ గ్రామంలోని సమస్యలను తెలుసుకున్నామని, ముఖ్యంగా ఇళ్ల సమస్య తన దృష్టికి వచ్చిందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. పుచ్చకాయలమడ గ్రామంలో 203 మందికి ఇంటి జాగాలు కొని ఇళ్లు కట్టించి ఇచ్చే బాధ్యత తాను తీసుకుంటానని సీఎం తెలిపారు. 48 మందికి పెన్షన్లు లేవని, వారికి పెన్షన్లు ఇచ్చే బాధ్యత తీసుకుంటామని అన్నారు.
News October 1, 2024
పింఛన్ పంపిణీ@2PM: కర్నూలు 96.43%, నంద్యాల 94.26%
ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పథకం కింద పింఛన్ల పంపిణీ కార్యక్రమం పండగలా కొనసాగుతోంది. మధ్యాహ్నం 2 గంటలకు కర్నూలు జిల్లాలో 96.43%, నంద్యాల జిల్లాలో 94.26% పంపిణీ పూర్తయింది. కర్నూలు జిల్లాలో 2,41,843 మందికి గానూ 2,33,204 మందికి, నంద్యాల జిల్లాలో 2,18,225 మందికి గానూ 2,05,691 మందికి పింఛన్ల సొమ్ము అందింది.