News March 21, 2025
నంద్యాల జిల్లాలో TODAY TOP NEWS

☞ బనగానపల్లెలో నకిలీ వైద్యుడి గుట్టురట్టు ☞ మంత్రి ఫరూక్ సతీమణి కన్నుమూత.. ప్రముఖుల సంతాపం ☞ గడిగరేవులలో గుండెపోటుతో ఉపాధ్యాయుడి మృతి ☞ రోడ్డు ప్రమాదంలో 15 మంది కూలీలకు తీవ్ర గాయాలు ☞ కీచక ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదు ☞ సీఎం పర్యటనకు జనరల్ ఫండ్ నుంచి రూ.2.50 కోట్లు ☞ ఫరూక్ సతీమణి చివరి కోరిక మేరకు HYDలోనే అంత్యక్రియలు ☞ బనగానపల్లె నియోజకవర్గంలో తీవ్రంగా తాగునీటి ఎద్దడి
Similar News
News March 22, 2025
కడప: ‘వైసీపీ నేత రూ.2 కోట్ల భూమి కబ్జా చేశాడు’

కడప జిల్లా ఒంటిమిట్ట మండలానికి చెందిన వైసీపీ నేత రూ.2 కోట్ల భూమి కబ్జా చేశాడని టీడీపీ నేత ఆలూరి నరసింహులు ఆరోపించారు. వివరాల్లోకి వెళ్తే.. కొత్తమాధవరం మాజీ సర్పంచ్ ఫేక్ డాక్యుమెంట్లతో రూ.2 కోట్ల విలువైన భూమిని ఆక్రమించి, అక్కడ హోటల్ కడుతున్నాడని ఫిర్యాదు చేశాడు. దీనిపై విచారించి చర్యలు తీసుకోవాలని శుక్రవారం ప్రజావినతుల స్వీకరణ కార్యక్రమంలో, అలాగే మంత్రిని కలిసి ఫిర్యాదు చేశాడు.
News March 22, 2025
డీలిమిటేషన్తో ఉత్తరాది డామినేషన్: కేటీఆర్

TG: డీలిమిటేషన్కు బీఆర్ఎస్ వ్యతిరేకమని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. తమిళనాడులో అఖిలపక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని చెప్పారు. ఎంపీల సంఖ్య తగ్గే అవకాశం ఉందని, భవిష్యత్తులో ఉత్తరాది డామినేషన్ పెరుగుతుందన్నారు. బీజేపీ చెప్పే మాటలకు, చేతలకు పొంతన లేదని విమర్శించారు.
News March 22, 2025
IPL: కాకినాడ కుర్రాడిపైనే దృష్టంతా!

మరికొన్ని గంటల్లో ఐపీఎల్ ప్రారంభమవుతుంది. మామిడికుదురు(M) గోకులమఠంలో పుట్టిన సత్యనారాయణరాజు ఐపీఎల్లో MI తరఫున ఆడుతున్నాడు. గోదావరి జిల్లాల ప్రజల చూపు ఇప్పుడు అతడిపైనే ఉంది. మొదటిసారి ఐపీఎల్లో ఎలా ఆడతాడని అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. రంజీ పోటీల్లో 8 మ్యాచ్లో 17 వికెట్లు తీసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ప్రస్తుతం కాకినాడలో ఉంటున్నాడు. ఈ కుర్రాడికి ప్లేయింగ్-11లో చోటు దక్కుతుందేమో వేచి చూడాలి.