News April 12, 2025
నంద్యాల జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

☞బండి ఆత్మకూరులో ఇంటర్ ఫెయిల్ కావడంతో మరో విద్యార్థి ఆత్మహత్య☞అన్నమయ్య జిల్లా DRDC సమావేశంలో మంత్రి బీసీ☞ఇంటర్ ఫలితాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాల విద్యార్థుల ప్రతిభ☞నంద్యాల మున్సిపల్ కార్యాలయం మార్పునకు రంగం సిద్ధం☞మహానందిలో ఒకేరోజు 15 పెళ్లిళ్లు☞మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే గౌరు చరిత ☞బాదంపప్పుపై ఆంజనేయస్వామి చిత్రం: చింతలపల్లె కోటేశ్
Similar News
News April 14, 2025
‘డబ్బులు ఊరికే రావు’ అని చిన్నప్పటి నుంచే చెప్పండి..

పిల్లలకు తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచే డబ్బు పాఠాలు నేర్పాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. అడిగినంత డబ్బులిస్తే ఆర్థిక క్రమశిక్షణ కొరవడుతుంది. పిల్లలు అవసరానికే కొంటున్నారా? ఆకర్షణకు లోనై ఖర్చు చేస్తున్నారా? అనే విషయాలపై శ్రద్ధ పెట్టాలి. ఖర్చు, పొదుపు మధ్య తేడాను వివరించాలి. పొదుపుతో కలిగే లాభాలు చెబితే ఆర్థిక క్రమశిక్షణ అలవడుతుంది. ఉన్నంతలో ఎలా జీవించాలో నేర్పిస్తే భవిష్యత్తు బాగుంటుంది.
News April 14, 2025
ప్రియురాలి భర్తను హత్య చేసేందుకు కుట్ర..!

వివాహేతర సంబంధంతో ప్రియురాలి భర్తను హత్య చేసేందుకు కుట్ర పన్నిన ఐదుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఖానాపురం హవేలీ సీఐ భానుప్రసాద్ తెలిపారు. సీఐ తెలిపిన కథనం ప్రకారం.. ముదిగొండ (మం) సువర్ణపురంకు చెందిన ధర్మ భార్యతో.. రామాంజనేయులు వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఎలాగైనా ప్రియురాలి భర్త(ధర్మ)ను అడ్డు తొలగించాలని తన స్నేహితులతో కుట్ర చేయడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.
News April 14, 2025
సంగారెడ్డి: ప్రవేశ పరీక్షకు దరఖాస్తులు ఆహ్వానం

మైనార్టీ గురుకుల పాఠశాలలలో ప్రవేశ పరీక్షకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనార్టీ అధికారి దేవుజ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. 5వ తరగతి, ఆరవ తరగతిలో ఖాళీగా ఉన్న సీట్లకు, ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాల కోసం www.tmreis.cgg.gov.in లో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. పూర్తి వివరాలకు సమీపంలోని మైనార్టీ పాఠశాలలో సంప్రదించాలని సూచించారు.