News March 6, 2025
నంద్యాల జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

☞ కొణిదెల పాఠశాలలో డీఈవో తనిఖీ ☞ అహోబిలం బ్రహ్మోత్సవాలకు 32 ప్రత్యేక బస్సులు ☞ Way2News ఎఫెక్ట్.. శ్రీశైలంలో తొలగిన దుర్వాసన ☞ మహానందిలో అద్భుత శిల్ప సంపద ☞ SDPI కార్యాలయంపై ఈడీ దాడులు ☞ చాగలమర్రిలో బైకులకు నిప్పు ☞ రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం ☞ డాక్టర్ పట్టా అందుకున్న ఎంబాయి విద్యార్థి ☞ బెలూం శింగవరంలో భార్యపై రోకలితో దాడి.. మృతి ☞ ALGలో ఉచితంగా ‘ఛావా’ చిత్ర ప్రదర్శన
Similar News
News March 7, 2025
కోనరావుపేటలో గుండెపోటుతో కార్మికుడి మృతి

కోనరావుపేట మండల కేంద్రానికి చెందిన వడ్డెర కార్మికుడు గుండెపోటుతో మృతి చెందాడు. కోనరావుపేట మండల కేంద్రానికి చెందిన దుండగుల కనకయ్య(50) అనే కార్మికుడు బావుసాయి పేట గ్రామ శివారులో బండలు కొట్టడానికి వెళ్ళాడు. ఆ క్రమంలో చాతిలో నొప్పి రావడంతో సిరిసిల్ల ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. మృతునికి భార్య కనకవ్వ, ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుర్లు ఉన్నారు.
News March 7, 2025
ఇంగ్లండ్ కెప్టెన్గా బెన్ స్టోక్స్?

ఇంగ్లండ్ వన్డే జట్టు కెప్టెన్గా సీనియర్ ప్లేయర్ బెన్ స్టోక్స్ను నియమిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే టీ20 జట్టుకు హారీ బ్రూక్ను సారథిగా నియమిస్తారని వార్తలు వస్తున్నాయి. కాగా బెన్ స్టోక్స్ ఇప్పటికే వన్డేలకు రెండుసార్లు రిటైర్మెంట్ పలికారు. దీనిపై మరోసారి ఆయనతో ఈసీబీ చర్చలు జరుపుతుందని సమాచారం. కాగా ఛాంపియన్స్ ట్రోఫీలో ఘోర ప్రదర్శన అనంతరం కెప్టెన్ పదవికి బట్లర్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
News March 7, 2025
గౌతాపూర్ మాజీ సర్పంచ్ మృతి

బాలానగర్ మండలంలోని గౌతాపూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ మాజీ సర్పంచ్ మల్లెకేడి యాదగిరిజీ అనారోగ్యంతో ఉస్మానియా ఆసుపత్రిలో గురువారం మృతి చెందారు. ఈయన 2009-2014 వరకు గ్రామ సర్పంచిగా పనిచేశాడు. అనంతరం బీఆర్ఎస్లో చేరి.. 2014 ఆగస్టులో ఎంపీటీసీగా పోటీ చేసి స్వల్ప మెజార్టీతో ఓడిపోయారు. ఆయనకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వివిధ పార్టీల చెందిన నాయకులు సంతాపం తెలిపారు.