News March 12, 2025

నంద్యాల జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

☞ ఆళ్లగడ్డలో భూమా నాగిరెడ్డికి మంచు మనోజ్ దంపతుల నివాళి
☞ రేపు కోవెలకుంట్ల, నంద్యాల GDCల్లో జాబ్ మేళా
☞ పోసాని విడుదలకు బ్రేక్.. గుంటూరుకు తరలింపు
☞ చెన్నంపల్లెలో భవన నిర్మాణ కార్మికుడి మృతి
☞ యువత పోరులో కలెక్టర్ కు YCP నేతల వినతి
☞ రంగాపురంలో పదవ తరగతి విద్యార్థిని ఆత్మహత్య
☞ తండ్రి మరణం.. పుట్టెడు దుఃఖంలోనూ పరీక్షకు
☞ శ్రీశైలంలో 27 నుంచి ఉగాది మహోత్సవాలు
☞ ఎర్రగుంట్ల PS సస్పెండ్

Similar News

News March 13, 2025

2025లో చంద్రగ్రహణం లేదు: కడప అర్చకులు

image

ఈ నెల 14వ తేదీ చాలామంది చంద్రగ్రహణం ఉందని భావిస్తున్నారు. కానీ 2025 సంవత్సరంలో చంద్రగ్రహణం, సూర్యగ్రహణం మన భారతదేశానికి వర్తించదని విశ్వహిందూ పరిషత్ కడప జిల్లా అర్చక పురోహితులు విజయ భట్టర్ తెలిపారు. కడపలో ఆయన మాట్లాడుతూ.. పండితులు సిద్ధాంతాలు పంచాంగ కర్తలు ప్రకారం ఈ సంవత్సరంలో ఎటువంటి సూర్య, చంద్ర గ్రహణాలు మన దేశానికి వర్తించవని స్పష్టం చేశారు.

News March 13, 2025

హోలి: కృత్రిమ రంగులు వాడుతున్నారా?

image

హోలి వేడుకల్లో కృత్రిమ రంగులను వాడటం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆ రంగులు కళ్లలో పడితే కంటి వాపు, మసకబారిపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయని చెబుతున్నారు. ఇక చర్మంపై పడితే పొడిబారడం, దురదలు వచ్చే ప్రమాదం ఉందని అంటున్నారు. ముక్కు, నోటి ద్వారా శరీరంలోకి వెళ్తే శ్వాస, జీర్ణ సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. సహజ రంగులనే వాడాలని సూచిస్తున్నారు.

News March 13, 2025

జూన్ నాటికి అర్హులకు 5 లక్షల ఇళ్లు: మంత్రి

image

AP: రాష్ట్రంలో ఈ ఏడాది జూన్ నాటికి 5 లక్షల ఇళ్లు నిర్మించి అర్హులకు ఇస్తామని మంత్రి పార్థసారథి చెప్పారు. పేదల ఇళ్ల నిర్మాణానికి కేంద్రం ఇచ్చిన నిధులను గత వైసీపీ ప్రభుత్వం ఇష్టానుసారంగా ఉపయోగించిందని దుయ్యబట్టారు. తాము అధికారంలోకి వచ్చాక 1.25 లక్షల నిర్మాణాలు పూర్తి చేశామని, మిగిలిన 7.25 లక్షల గృహ నిర్మాణాలను 2026 మార్చిలోగా పూర్తి చేస్తామని పేర్కొన్నారు.

error: Content is protected !!