News March 13, 2025

నంద్యాల జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

☞ అహోబిలంలో కన్నుల పండుగగా రథోత్సవం
☞ ఆళ్లగడ్డలో Way Newsతో ఇంటర్ విద్యార్థులు
☞ తమ్మరాజుపల్లె ఘాట్ లో బొలెరో తో ఢీ.. చోరీ
☞ కంపమల్లలో YCP నేతపై హత్యాయత్నం
☞ లోకేశ్వర్ రెడ్డిపై దాడి TDP పనే: YCP
☞ పవన్ కళ్యాణ్ రాజీనామా చెయ్యాలి: భూమా కిశోర్ రెడ్డి
☞ ఈసారి TDP వాళ్లు ఓట్లు అడిగితే..: బైరెడ్డి
☞ ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు
☞ మంత్రి నారా లోకేశ్ కు కృతజ్ఞతలు: పాణ్యం MLA

Similar News

News March 14, 2025

వికారాబాద్: యువత చట్టాలపై అవగాహన కల్పించుకోవాలి: జడ్జి 

image

యువత చట్టాలపై అవగాహన కల్పించుకోవాలని జిల్లా సేవాధికార సంస్థ సెక్రటరీ జడ్జి శీతాల్ తెలిపారు. వికారాబాద్ పట్టణంలోని శ్రీ అనంతపద్మనాభ ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జడ్జి శీతాల్ మాట్లాడుతూ.. చట్టాలపై అవగాహన కల్పించుకుని బాల్యవివాహాల నిర్మూలనకు యువత కృషి చేయాలన్నారు.

News March 14, 2025

ఆపదలో ఉంటే 100కు ఫోన్ చేయండి: SP

image

మెదక్ జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ ఉదయ్ కుమార్ మాట్లాడుతూ.. విద్య, ఉపాధి, రాజకీయ రంగాల్లో మహిళల భాగస్వామ్యం పెరగాలని అన్నారు. ఆపద సమయాల్లో అధైర్యపడకుండా వెంటనే డయల్‌ 100కు సమాచారం అందించాలన్నారు. అనంతరం విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన మహిళలకు
ప్రశంసాపత్రాలు అందించారు.

News March 14, 2025

రాయపర్తి: చేపల వేటకు వెళ్లి మత్స్యకారుడు మృతి

image

రాయపర్తి మండలం మైలారం గ్రామానికి చెందిన వెంకన్న (38) చేపల వేటకు వెళ్లి నీట మునిగి మృతి చెందాడు. ఎస్సై శ్రవణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామ మత్స్యకారులతో కలిసి వెంకన్న గురువారం సాయంత్రం తాళ్లకుంటలోకి చేపలు పట్టేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో వల కాళ్లకు చుట్టుకుని నీట మునిగి మృతి చెందాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రవణ్ కుమార్ వివరించారు.

error: Content is protected !!