News March 24, 2024

నంద్యాల: టీడీపీలో చేరిన చల్లా కుటుంబ సభ్యులు

image

బనగానపల్లె నియోజకవర్గంలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. దివంగత మాజీ ఎమ్మెల్యే చల్లా రామకృష్ణారెడ్డి సోదరుడు, అవుకు కేడీసీసీ బ్యాంకు ఛైర్మన్ చల్లా విజయ భాస్కర్ రెడ్డి, ఆయన బావమరిది కాశీపురం మెట్ల రామిరెడ్డి టీడీపీలో చేరారు. అమరావతిలోని చంద్రబాబు స్వగృహం నందు వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు.

Similar News

News February 6, 2025

విద్యావ్యవస్థ బలోపేతానికి ప్రతిపాదనలు పంపండి: కలెక్టర్

image

పాఠశాల విద్యావ్యవస్థ బలోపేతానికి ప్రతిపాదనలను పంపాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా అధికారులను కోరారు. బుధవారం పాఠశాలల బలోపేతం- రీస్ట్రక్చరింగ్ అంశంపై కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో వలసకు వెళ్లే విద్యార్థులు చదువుకు దూరం కాకూడదని అన్నారు. పాఠశాలలు అందుబాటులో ఉండేలా ప్రతిపాదనలు ఉండాలని మండల విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.

News February 5, 2025

కర్నూలు APSP బెటాలియన్ కమాండెంట్‌గా దీపిక బాధ్యతల స్వీకరణ

image

కర్నూలు ఏపీఎస్పీ 2వ బెటాలియన్ కమాండెంట్‌గా దీపిక పాటిల్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. పోలీసుల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తానని వెల్లడించారు. ముందుగా బెటాలియన్ అధికారుల నుంచి ఆమె గౌరవ వందనం స్వీకరించారు. అడిషనల్ కమాండెంట్ మెహబూబ్ బాషా, తదితరులు పాల్గొన్నారు.

News February 5, 2025

కుటుంబానికి 100 రోజులు పని కల్పించాలి: కలెక్టర్

image

ఉపాధి హామీ పథకం ద్వారా ప్రతి రోజూ లక్ష మందికి ఉపాధి పనులు కల్పించాలని ఏపీడీ, ఎంపీడీవో, ఏపీవోలను కలెక్టర్ రంజిత్ బాషా ఆదేశించారు.ఉపాధి హామీ పనుల పురోగతి అంశంపై ఏపీడీలు, ఎంపీడీవోలు, ఏపీవోలతో కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ ద్వారా బుధవారం సమీక్ష నిర్వహించారు. పనుల కల్పనలో వెనుకబడిన అధికారులతో మాట్లాడారు. కుటుంబానికి 100 రోజుల పని కల్పించాలన్నారు.

error: Content is protected !!