News May 25, 2024

నంద్యాల: నెల రోజులపాటు ఈ రెండు రైళ్లు రద్దు

image

గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో ట్రాక్ పనుల మరమ్మతుల పనుల కారణంగా రైళ్ల రద్దు మరికొంత కాలం పొడిగిస్తూ రైల్వే ఉన్నాతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారని డోన్ రైల్వేస్టేషన్ మేనేజర్ జి.వేంకటేశ్వర్లు తెలిపారు. గుంటూరు నుంచి డోన్(17228) రైలు, హుబ్బళ్లి నుంచి విజయవాడు(17329) జూన్ 30వ తేదీవరకు రద్దు చేసినట్లు పేర్కొన్నారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి రైల్వే వారికి సహకరించాలని కోరారు.

Similar News

News October 11, 2024

జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించిన బెళగల్ విద్యార్థి

image

కోసిగి మండలం దొడ్డి బెళగల్‌కు చెందిన జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థి సందిప్ ఆగ్రాలో జరిగిన జాతీయ స్థాయి లాక్రోస్ క్రీడల్లో గోల్డ్ మెడల్ సాధించాడు. విద్యార్థిని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జీయాన్ కుమారి అభినందించారు. ఆమె మాట్లాడుతూ.. తమ పాఠశాల విద్యార్థి జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించడం సంతోషంగా ఉందన్నారు. రానున్న రోజుల్లో మరింత మెరుగైన స్థాయిలో ఆడాలని ఆకాంక్షించారు.

News October 11, 2024

నంద్యాల జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయుధ పూజా

image

నంద్యాల జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ఆధ్వర్యంలో శుక్రవారం ఆయుధ పూజ చేశారు. అర్మ్‌డ్ రిజర్వ్ విభాగంలో గల ఆయుధాగారంలో దుర్గామాతకు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. జిల్లా ప్రజలకు ఎస్పీ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. దుర్గా మాత ఆశీస్సులతో ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షించారు.

News October 11, 2024

అయ్యో పాపం.. అమ్మ చనిపోయిందని తెలియక!

image

కర్నూలు జిల్లా సి.బెళగల్ బస్టాండ్ ఆవరణలో కుక్క చనిపోయింది. ఇవాళ తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు విడిచింది. ఈ కుక్కకు నాలుగు పిల్లలు ఉండగా తల్లి చనిపోయిన విషయం వాటికి తెలియదు. తల్లి లేస్తుందేమోనని ఆశతో ఒడిలో నిద్రపోయాయి. ఆ పిల్లల దీనస్థితిని చూస్తూ అటుగా వెళ్లేవారు అయ్యో పాపం అంటూ వెళ్లిపోయారు. మృతదేహం వద్ద ఉన్న ఆ పిల్లలు చూపరులకు కంటతడి తెప్పించాయి.