News July 13, 2024
నంద్యాల: రైలు నుంచి కింద పడిన భార్య.. కాపాడే క్రమంలో భర్త మృతి

రైలు నుంచి కిందపడిన భార్యను కాపాడబోయి భర్త మృతిచెందిన ఘటన డోన్ సమీపంలోని ఎర్రగుంట్ల వద్ద జరిగింది. దంపతులు సయ్యద్ ఆసిఫ్, అసియాబాను ఫుట్బోర్డుపై కూర్చొని ప్రయాణిస్తుండగా నిద్రమత్తులో భార్య కిందపడింది. గమనించిన భర్త ఆమెను కాపాడేందుకు రైలు నుంచి దూకి మృతిచెందాడు. మహిళను డోన్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కర్ణాటకకు చెందిన వీరు.. 4 నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
Similar News
News March 13, 2025
కర్నూలు జిల్లా నేటి ముఖ్యాంశాలు..!

➤ మంత్రాలయంలో ఆకట్టుకున్న భారీ రంగోలి
➤ రూ.2.06 కోట్ల నిధుల వినియోగానికి పచ్చజెండా: మేయర్
➤ హౌసింగ్ లబ్ధిదారులకు అదనపు ఆర్థిక సహాయం: కలెక్టర్
➤ రేపు పత్తికొండలో టమాటా ప్రాసెసింగ్ యూనిట్ కు భూమిపూజ
➤ ఆదోని నియోజకవర్గ సమస్యలపై MLA పార్థసారథి అసెంబ్లీలో గళం
➤ వైసీపీపై అసెంబ్లీలో ఎమ్మిగనూరు ఎమ్మెల్యే ఆగ్రహం
➤ కూటమి ప్రభుత్వంపై బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి తీవ్ర విమర్శలు
News March 13, 2025
రూ.2.06 కోట్ల నిధుల వినియోగానికి పచ్చజెండా: మేయర్

కర్నూలులో మౌలిక వసతుల కల్పనే తమ ప్రధాన లక్ష్యమని నగర మేయర్ బీవై రామయ్య అన్నారు. గురువారం కర్నూలు నగర పాలక కార్యాలయంలో స్థాయి సంఘ సమావేశం నిర్వహించారు. 10 తీర్మానాలను, సాధారణ నిధుల నుంచి రూ.2.06 కోట్ల నిధుల వినియోగానికి పచ్చజెండా ఊపారు. మేయర్ మాట్లాడుతూ.. ప్రజా విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకొని, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నామన్నారు.
News March 13, 2025
రేపు పత్తికొండలో టమాటా ప్రాసెసింగ్ యూనిట్కు భూమిపూజ

పత్తికొండ మండలంలో టమాటా ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు మరో ముందడుకు పడింది. రూ.11కోట్ల వ్యయంతో కోతిరాళ్ల పంచాయతీ పరిధిలో ఈ యానిట్ ఏర్పాటుకు రేపు భూమి పూజ జరగనుంది. మంత్రి TG భరత్, ఎమ్మెల్యే శ్యామ్కుమార్ భూమి పూజ చేసి పనులను ప్రారంభించనున్నారు. కాగా పత్తికొండ, మద్దికెర, తుగ్గలి, క్రిష్ణగిరి, వెల్దుర్తి మండలాల్లో టమాటా అధికంగా సాగువుతోంది. ఈయూనిట్ ప్రారంభమైతే తమకు ధర లభిస్తుందని రైతులు ఆశిస్తున్నారు.