News March 14, 2025
నంద్యాల: హత్యాయత్నం కేసులో ఇద్దరికి 7ఏళ్ల జైలు శిక్ష

హత్యాయత్నం కేసులో ఇద్దరికి 7ఏళ్ల జైలు శిక్ష, ఒక్కొక్కరికి రూ.11వేల జరిమానా విధిస్తూ నంద్యాల జిల్లా కోర్టు న్యాయమూర్తి రాధారాణి తీర్పు చెప్పారు. తమ్మరాజుపల్లె గ్రామంలో 2017లో శివమ్మ అనే మహిళపై హత్యాయత్నం జరిగింది. తన అక్రమ సంబంధం తెలిసిందనే కారణంతో కోడలు ప్రియుడితో కలిసి ఈ ఘటనకు పాల్పడింది. అత్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నేరం రుజువు కావడంతో నిందితులకు శిక్ష పడింది.
Similar News
News March 14, 2025
ఫ్యామిలీతో కలిసి రోహిత్ శర్మ మాల్దీవుల విహారం

టీమ్ ఇండియాకు ఛాంపియన్స్ ట్రోఫీ తెచ్చిపెట్టిన కెప్టెన్ రోహిత్ శర్మ ఆ టోర్నీ అనంతరం ఫ్యామిలీతో కలిసి విహారయాత్రలో గడుపుతున్నారు. భార్యాబిడ్డలతో కలిసి మాల్దీవులకు వెళ్లారు. దానికి సంబంధించి ఆయన ఇన్స్టాలో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. వచ్చే 2 నెలల పాటు ఐపీఎల్తో తీరిక లేని షెడ్యూల్లో ఉండనున్న నేపథ్యంలో ఆయన ఈ బ్రేక్ తీసుకున్నట్లు తెలుస్తోంది. రెండు మూడురోజుల్లో ఆయన ముంబై జట్టుతో కలవనున్నారు.
News March 14, 2025
అవుట్సోర్సింగ్ ఉద్యోగాల ప్రచారం ఫేక్: ఈఓ

సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహ దేవస్థానంలో అవుట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగాల నియామకం జరుగుతుందనే ప్రచారాన్ని నమ్మవద్దని ఆలయ ఈఓ సుబ్బారావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వాట్సాప్ /సోషల్ మీడియా గ్రూపుల్లో ఈ ప్రచారం జరుగుతుందని దేవస్థానం దృష్టికి వచ్చిందన్నారు. ఆలయానికి సంబంధించి ఎలాంటి ఉద్యోగాలు ప్రకటనలు ఇవ్వలేదని స్పష్టం చేశారు. తప్పుడు ప్రకటనలను నమ్మి నిరుద్యోగులు మోసపోవద్దని సూచించారు.
News March 14, 2025
మహిళ రక్షణకు శక్తి యాప్ ఒక ఉక్కు కవచం: తిరుపతి SP

మహిళ రక్షణకు శక్తి యాప్ ఒక ఉక్కు కవచమని తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. ఆయన మాట్లాడుతూ..ప్రతి ఒక్క మహిళ మొబైల్ లో “శక్తి” యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆపద సమయంలో పోలీసు వారి సహాయం పొందాలన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా మహిళలు, బాలికల భద్రత కొరకు శక్తి యాప్ (SHAKTI App) ను రూపొందించిందని తెలిపారు.