News April 5, 2025

నంద్యాలకు రైలులో ప్రయాణించిన మంత్రి ఫరూక్

image

మంత్రి ఫరూక్ తన హోదాని పక్కనపెట్టి సాధారణ పౌరుడిగా రైలులో ప్రయాణించారు. విజయవాడ నుంచి నంద్యాలకు రైలులో బయలుదేరారు. ప్రజలతో మమేకమవుతూ, సమస్యలపై ఆరా తీస్తూ తన ప్రయాణాన్ని సాగించారు. ఇది చూసిన ప్రయాణికులు మంత్రి సింప్లిసిటీని ప్రశంసించారు. ప్రజాధనం వృథా చేయకుండా మంత్రి నిర్ణయం భేష్ అంటూ కొనియాడారు.

Similar News

News April 13, 2025

ఇల్లు కొనాలనే తొందరలో తప్పులొద్దు!

image

సొంతిల్లు కొనాలనే తొందరలో కొందరు చేసే చిన్న తప్పులే మున్ముందు చాలా ఇబ్బందులు తెస్తాయి. ముందుగా అసలు ఇల్లు ఎందుకు కొనాలని అనుకుంటున్నామో స్పష్టత ఉండాలి. ఏ ప్రాంతంలో కొంటున్నాం? అక్కడ వృద్ధి ఎలా ఉంటుంది? అద్దెకు ఇస్తే ఆదాయం ఎంతొస్తుంది? ముందుగా అనుకున్న దాని కంటే ఎక్కువ మొత్తాన్ని వెచ్చిస్తున్నామా? తదితర ప్రశ్నలు వేసుకోకపోతే భవిష్యత్తు ఆర్థిక ప్రణాళికలు దెబ్బతింటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

News April 13, 2025

ASF: తాటి ముంజలకు భలే గిరాకీ

image

ఎండాకాలం వచ్చిందంటే వేడి తాపానికి ఉపశమనం కలుగజేసే తాటి ముంజలు జిల్లాలో అందుబాటులో లభిస్తాయని ప్రజలు అంటున్నారు. శనివారం వాంకిడి మండలకేంద్రంలో తాటి ముంజల విక్రయాలు జోరందుకున్నాయి. ప్రజలు ముంజలు కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. ముంజలు తింటే ఆరోగ్యానికి ఎన్నో ఉపయోగాలున్నాయని వైద్యలు సూచించడంతో కొనడానికి మక్కువ చూపుతున్నారు.

News April 13, 2025

కడెం: ఉరేసుకొని యువతి ఆత్మహత్య

image

ఉరివేసుకొని యువతి మృతి చెందిన ఘటన కడెం మండలంలో చోటుచేసుకుంది. ఎస్సై కృష్ణసాగర్‌రెడ్డి కథనం ప్రకారం.. మండలంలోని మర్రిగూడెం గ్రామానికి చెందిన అనూషను(21) శుక్రవారం సాయంత్రం ఓ విషయంలో తల్లి మందలించింది. మనస్తాపానికి గురై ఇంటి పక్కన ఉన్న షెడ్డులో ఉరేసుకుంది. అనూష తండ్రి రాజేశ్వర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

error: Content is protected !!