News May 18, 2024
నన్నయ వర్సిటీ పరిధిలో 144 సెక్షన్: మాధవీలత
తూర్పు గోదావరి జిల్లాలో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఈవీఎంలను భద్రపరిచిన నన్నయ విశ్వవిద్యాలయం నుంచి కిలోమీటర్ మేర 144 సెక్షన్ అమలుపరచడం జరుగుతుందని కలెక్టర్ మాధవీలత తెలిపారు. రాజమహేంద్రవరంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద ఆమె మాట్లాడుతూ.. ఈవీఎంలు, వీవీప్యాట్ల భద్రతకు పకడ్బందీగా ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. భద్రతా ఏర్పాట్లును ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నట్లు తెలిపారు.
Similar News
News October 1, 2024
కోనసీమ: బాలికపై లైంగిక దాడి.. యువకుడి రిమాండ్
బాలికపై లైంగిక దాడి కేసులో అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం పట్టణానికి చెందిన వెంకటకృష్ణను అరెస్టు చేసినట్లు CI అశోక్ కుమార్ తెలిపారు. ఇంటర్ సెకండియర్ విద్యార్థిని(17)పై ప్రేమ పేరిట లైంగిక దాడికి పాల్పడిన నేరంపై పోక్సో కేసు నమోదు చేశామన్నారు. AUG 16న బాలిక ఒంటరిగా ఉండగా, వెంకటకృష్ణ మద్యం తాగి లైంగిక దాడికి పాల్పడ్డాడన్నారు. నిందితుడికి కోర్టు జుడీషియల్ రిమాండ్ విధించినట్లు పేర్కొన్నారు.
News October 1, 2024
తూ.గో: కొండ వాగులో బాలుడి మృతదేహం లభ్యం
అల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకు విగత జీవిగా వాగు నీటిలో తేలడం చూసి ఆ తల్లిదండ్రుల హృదయం ముక్కలైంది. తూ.గో జిల్లా సీతానగరానికి చెందిన పదో తరగతి విద్యార్థి వినయ్(15) కొండ గోదావరి వాగులో ఆదివారం <<14229819>>గల్లంతైన విషయం<<>> తెలిసిందే. గాలింపు చర్యలు చేపట్టగా సోమవారం మృతదేహం లభ్యమైంది. స్నేహితులతో కలిసి సరదాగా ఫొటోషూట్కి వెళ్లిన కొడుకు శవమై ఇంటికి రావడంతో తల్లి వరలక్ష్మి, తండ్రి శ్రీనివాస్ బోరున విలపించారు.
News October 1, 2024
లబ్ధిదారులందరికీ సకాలంలో పెన్షన్ల పంపిణీ: మంత్రి దుర్గేష్
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లబ్ధిదారులకు సకాలంలో ఇండ్ల వద్దకే వెళ్లి పెన్షన్లను అందిస్తున్నామని రాష్ట్ర పర్యటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఈ మేరకు ఆయన తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు మండలం విజ్జేశ్వరం గ్రామంలో మంగళవారం ఉదయం సచివాలయ సిబ్బంది నిర్వహించిన పెన్షన్ల పంపిణీ ప్రక్రియను పరిశీలించారు. అదేవిధంగా లబ్ధిదారులకు ఆయన పెన్షన్ల సొమ్మును అందజేశారు.