News August 2, 2024

నరసన్నపేట: పెన్షన్ పంపిణీలో అలసత్వం.. 30 మందికి నోటీసులు

image

ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం నగదు పంపిణీలో అలసత్వం ప్రదర్శించిన 30 మంది సిబ్బందికి షోకాజ్ నోటీసులిచ్చినట్లు నరసన్నపేట ఎంపీడీవో రామకృష్ణ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉదయం 5.30 గంటలకు పెన్షన్ ప్రారంభించాల్సి ఉండగా 6.30 గంటలు వరకు కూడా నగదు పంపిణీని సిబ్బంది ప్రారంభించలేదన్నారు. దీంతో వారికి నోటీసులిచ్చినట్లు తెలిపారు.

Similar News

News October 8, 2024

శ్రీకాకుళం: కేజీబీవీల్లో ఖాళీలు.. 15 వరకు అప్లై చేసుకోండి

image

శ్రీకాకుళం జిల్లాలోని KGBVలో ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేసేందుకు పలు పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు DEO తిరుమల చైతన్య తెలిపారు. కుకింగ్- 9, డేనైట్ వాచ్‌మెన్- 4, స్కావెంజర్- 3, స్వీపర్- 4 పోస్టులు ఖాళీలు ఉన్నాయన్నారు. అలాగే ఆదర్శ పాఠశాలల్లో చౌకీదారు- 6, హెడ్‌కుక్- 4, సహాయ కుక్- 6 పోస్టులకు ఆసక్తి గల మహిళలు ఈ నెల 15లోగా MEO కార్యాలయాల్లో దరఖాస్తులు అందజేయాలన్నారు.

News October 8, 2024

శ్రీకాకుళం: మద్యం దుకాణాలకు 880 దరఖాస్తులు

image

శ్రీకాకుళం జిల్లాలో నూతనంగా ఏర్పాటుకానున్న ప్రైవేట్ మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసుకునేందుకు రెండు రోజులే గడువు ఉంది. ఈ నెల 2న ప్రారంభమైన ప్రక్రియ 9వ తేదీతో ముగియనుంది. అక్టోబర్ 7 నాటికి జిల్లావ్యాప్తంగా 158 దుకాణాలకు 880 దరఖాస్తులు వచ్చాయి. శ్రీకాకుళంలో 32 దుకాణాలకు 266, టెక్కలిలో 11కు 19, కోటబొమ్మాళిలో 15 షాపులకు 31, రణస్థలంలో 15కు 176 దరఖాస్తులు వచ్చాయని ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు.

News October 8, 2024

దళారులను నమ్మి మోసపోవద్దు: మంత్రి

image

మద్యం దుకాణాలకు ఎవరైనా, ఎక్కడి నుంచైనా ఎలాంటి ఇబ్బందులు లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయడు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రప్రభుత్వం మద్యం విధానంపై రాజీపడే పడే ప్రసక్తే లేదన్నారు. వ్యాపారులు, ఆశావాహులు ఎవరైనా స్వేచ్ఛగా మద్యం దుకాణాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. దళారులను నమ్మి మోసపోవద్దన్నారు.