News April 15, 2024

నరసన్నపేట: పెయింటర్ అనుమానాస్పద మృతి

image

నరసన్నపేటలోని ఒక పెయింటర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. నరసన్నపేట పట్టణంలో పెయింటర్‌గా పనిచేస్తున్న గండి సోమేశ్వరరావు కుటుంబ కలహాలు కారణంగా ఈనెల 11వ తేదీన విశాఖపట్నం వెళుతున్నట్లుగా కుటుంబ సభ్యులకు తెలిపారు. అయితే ఆదివారం సాయంత్రం అతని మృతదేహం కనిపించింది. మండలంలోని సత్యవరం వద్ద మృతదేహాన్ని గుర్తించినట్లు ఎస్సై అశోక్ బాబు తెలిపారు.

Similar News

News September 16, 2024

నరసన్నపేట: ఆర్థిక ఇబ్బందులతో యువకుడి ఆత్మహత్య

image

నరసన్నపేట పట్టణంలోని కలివరపుపేట వీధికి చెందిన వైశ్యరాజు నాగరాజు(32) సోమవారం ఫ్యానుకు ఉరేసుకుని మృతి చెందాడు. కొన్నేళ్లుగా ఓ వ్యక్తి దగ్గర ఫైనాన్షియల్ కలెక్షన్ ఏజెంట్‌గా పని చేస్తున్నాడని ఆర్థిక ఇబ్బందులు కారణంగానే తాను మృతి చెందాడని తండ్రి లక్ష్మణ రాజు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. మృతుని తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై దుర్గ ప్రసాద్ తెలిపారు.

News September 16, 2024

నీట్ పీజీలో సిక్కోలు యువకుడి ప్రతిభ

image

నందిగం మండలం దిమిలాడ గ్రామానికి చెందిన నడుపూరు సాయికిరణ్ నీట్ మెడికల్ పీజీలో రాష్ట్ర స్థాయి 316వ ర్యాంకు సాధించి ప్రతిభ కనబరిచాడు. విజయనగరం మిమ్స్ మెడికల్ కాలేజ్‌లో ఎంబీబీఎస్ పూర్తిచేసిన యువకుడు పీజీ ప్రవేశం కోసం నీట్ పీజీ ప్రవేశ పరీక్షను రాశాడు. ఈ మేరకు డా.ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అధికారులు సోమవారం ఫలితాలు వెల్లడించారు. యువకుడి తండ్రి ఎన్.వి రమణమూర్తి మెరైన్ కానిస్టేబుల్, తల్లి నవనీత గృహిణి.

News September 16, 2024

శ్రీకాకుళం: కోర్టు మానిటరింగ్ సిస్టం సిబ్బందితో ఎస్పీ సమావేశం

image

జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం కోర్టు మానిటరింగ్ సిస్టం సిబ్బందితో జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి సమావేశమయ్యారు. కేసులు పరిష్కారం, శిక్షలు పడేందుకు కోర్టు కానిస్టేబుల్ విధులు చాలా కీలకం అని జిల్లా ఎస్పీ అన్నారు. ఈ సందర్భంగా వివిధ కోర్టులో విచారణలో ఉన్న కేసుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు.