News April 19, 2025

నరసన్నపేట: వీడిన మిస్టరీ.. గుండెపోటుతో ఉద్యోగి మృతి

image

నరసన్నపేట మండల కేంద్రంలో స్థానిక మారుతీనగర్ ఒకటో వీధిలో అనుమానస్పద మృతి కేసును పోలీసులు ఛేదించారు. వంశధార సబ్ డివిజన్‌లో అటెండర్‌గా పనిచేస్తున్న కొర్రాయి వెంకటరమణ గత మూడు రోజుల కిందట ఇంటి వద్ద ఉన్న సమయంలో గుండెపోటు రావడంతోనే మృతి చెందినట్లు ఎస్సై సీహెచ్ దుర్గాప్రసాద్ ధ్రువీకరించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించామని చెప్పారు. దీనిపై కేసు నమోదు చేశామని తెలిపారు.

Similar News

News April 20, 2025

వివాహిత హత్య.. నిందితుడి కోసం గాలింపు

image

రణస్థలంలోని పైడిభీమవరంలో నడిరోడ్డుపై శనివారం వివాహిత భవాని దారుణ హత్య కలకలం రేపిన సంగతి తెలిసిందే. గుర్తు తెలియని వ్యక్తి చాకుతో ఆమె గొంతుకోసి సంఘటన స్థలంలోనే చాకును నీళ్లతో కడిగి పడేసి వెళ్లాడు. మృతురాలు పని చేస్తున్న హోటల్‌లోని వ్యక్తిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. భవానీ స్వగ్రామం విజయనగరం(D) పెద్ద పతివాడ గ్రామం. నాలుగేళ్ల క్రితం పైడిభీమవరంలోని వెంకట సత్యంతో ఈమెకు వివాహమైంది.

News April 20, 2025

నేడే మెగా డీఎస్సీ.. శ్రీకాకుళం జిల్లాలో 458 పోస్టులు

image

ఆదివారం ఉదయం 10 గంటలకు 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను మంత్రి నారా లోకేష్ విడుదల చేయనున్నారు. శ్రీకాకుళం జిల్లాలో 458 పోస్టులు కలవు. ఇందులో SA లాంగ్వేజ్-1లో 37, SA హిందీ 11, SA ఇంగ్లీష్ 65, SA మ్యాథ్స్ 33, SA-PS 14, SA-BS 34, SA సోషల్ 70, SA-PE 81, SGT 113 పోస్టులు ఉన్నాయి. ట్రైబల్ వేల్ఫేర్ ఆస్రంలో 85 పోస్టులు భర్తీ చేయనున్నారు.

News April 20, 2025

ఇచ్ఛాపురంలో నేడు  కేంద్రమంత్రి పర్యటన

image

ఇచ్ఛాపురం నియోజకవర్గంలో నేడు(ఆదివారం) కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పర్యటించనున్నారు. సోంపేట మండల కేంద్రంలో అగ్రికల్చర్ ఆఫీస్ భవనాన్ని ప్రారంభించనన్నారు. కంచిలి మండలం అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ సమావేశంలో పాల్గొంటారు. ఇచ్ఛాపురం మండలంలో బెల్లుపడలో జరుగుతున్న యజ్ఞంలో పాల్గొని, అనంతరం ప్రజలు నుండి వినతులు స్వీకరిస్తారు.

error: Content is protected !!